నిజమేనండోయ్…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం మంత్రి ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ముందు అడ్మిషన్ల కోసం జనం బారులు తీరారు. ఉచితంగా విద్యనందిస్తున్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు క్యూ కట్టిన జనంతో ఆ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. చూడటానికి ఇది ప్రైవేట్ స్కూలే గానీ… విద్య మాత్రం ఉచితంగానే అందుతుందట.
నల్లగొండ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకటరెడ్డి… ఓ దఫా భువనగిరి నుంచి ఎంపీగానూ ప్రాతినిధ్యం వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరున్న వెంకటరెడ్డి… వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు నేల విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండిపోగా… వెంకటరెడ్డి పార్టీని అంటిపెట్టుకుని సాగారు. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా.. కోమటిరెడ్డి మరోమారు మంత్రి అయ్యారు. వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే 2011లో పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ రెడ్డి చనిపోయారు.
19 ఏళ్ల వయసులోనే చనిపోయిన తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ వెంకటరెడ్డి పలు మార్లు కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో తన కుమారుడి పేరు మీదే ఓ ట్రస్టును ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి… దాని కింద చాలా కార్యక్రమాలు చేపట్టారు. అందులో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ఓ ప్రైవేట్ పాఠశాలనూ ఆయన ఏర్పాటు చేశారు. తాజాగా సదరు పాఠశాలను రూ.8 కోట్ల తన సొంత నిధులతో మెరుగులు అద్దారు.
ఈ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాల విషయానికి వస్తే.. 36 ఏసీ తరగతి గదులు, ఏఐ అధారిత విద్యాబోధన, డిజిటల్ ల్యాబ్స్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇన్ స్ట్రక్షన్ బోర్డులు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్రీడలు ఉన్నాయి. ఓ కార్పోరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ పాఠశాలలో విద్యను మాత్రం ఉచితంగానే అందిస్తారు. అయితే పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన వారికే ఈ పాఠశాలలో అడ్మిషన్లు లభిస్తాయట. అందుకే ఈ రెండు వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కట్టారు. వెంకటరెడ్డి కృషి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
This post was last modified on April 7, 2026 5:10 pm
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…