ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్లు పవన్ చూసినప్పటికీ కనీసం దాని పేరు మీద కొన్ని ఓపెనింగ్ రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో వాటి గురించి చెప్పుకుంటారు. కానీ ఉస్తాద్ అందులో సగం కూడా చూపించలేకపోయింది. వంద కోట్ల గ్రాస్ అందుకోలేక త్వరగా సెలవు తీసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ రన్ వారం క్రితమే ముగిసింది.
గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబోగా దర్శకుడు హరీష్ శంకర్ – హీరో పవన్ కళ్యాణ్ మీద అప్పటిదాకా ఉన్న స్పెషల్ ఇంప్రెషన్, గర్వం మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ తో పోయింది. ముందు నుంచి ఈ ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన కొందరు అభిమానుల భయాలకు తగ్గట్టే ఫలితం రావడం ట్రాజెడీ. మెయిన్ సెంటర్స్ లో ఇంకా థియేటర్ రన్ కొనసాగుతోంది కానీ నామ మాత్రపు వసూళ్లతో ఏదో మొక్కుబడిగా లాగిస్తున్నారు అంతే.
దురంధర్ ది రివెంజ్ ప్రభావం వల్లే ఇలా జరిగిందని ఎవరైనా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఉగాది అడ్వాంటేజ్ వల్ల ఉస్తాద్ కు ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయి కానీ ఇంకో టైంలో వచ్చి ఉంటే నెగటివిటీ, ట్రోలింగ్ ఇంకా ఎక్కువ ఉండేదేమో. హరీష్ శంకర్ విపరీతమైన ప్రమోషన్లు చేసినప్పటికీ అవేవి పని చేయలేదు. ఒక దశ దాటాక ఇక ఆపేయండి సార్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పాల్సి వచ్చింది.
ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా అర్ధమయ్యి ఉంటుంది. కేవలం తాను ఉన్నంత మాత్రాన సినిమా చూసేందుకు జనాలు ఎగబడిపోరు. ఏపీ డిప్యూటీ సిఎంగా పాలనలో తన ముద్ర ఎంత గొప్పగా చూపించినా సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడు వివక్షలకు అతీతంగా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కు పరాజయం తప్పలేదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…