ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి భాగం ముగిసిన తీరు చూశాక, సహజంగానే పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రెండో భాగంలో కథను మరింత స్ట్రాంగ్ గా మార్చేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త పాత్రలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యే జరిగిన షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. వీరు కాకుండా సినిమాలో మరో నెగిటివ్ రోల్ ఉండబోతోందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రను చాలా పవర్ఫుల్ గా చూపించారు. దానికి తోడుగా ఇప్పుడు మరో క్రూరమైన విలన్ పాత్రను ప్రవేశపెట్టాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జేడీ చక్రవర్తి ఈ సినిమాలో నటిస్తున్నారని గతంలో కొన్ని రూమర్లు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, కమల్ హాసన్ కి కుడిభుజంలా ఉండే మరో విలన్ పాత్ర ఇందులో ఉండబోతోందట. ఆ పాత్రకు బాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్ని తీసుకుంటే సినిమాకు నార్త్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నటుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
మొదటి భాగంలో కర్ణుడి పాత్రకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల రెండో భాగం మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెగిటివ్ రోల్స్ కూడా అంతే బలంగా ఉంటేనే హీరో ఎలివేషన్లు పండుతాయని నాగ్ అశ్విన్ నమ్ముతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్లు ఈసారి మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ముఖ్యంగా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో పాటు పురాణాలను జోడించి ఈ కొత్త నెగిటివ్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు తోడు ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ కూడా తోడైతే కల్కి సీక్వెల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్ కూడా త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతుండటంతో అప్పటికి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
This post was last modified on March 31, 2026 3:03 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…