నిఖిల్ ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ముందు ఫిబ్రవరి అన్నారు. తర్వాత డ్రాప్ అయ్యారు. ఏప్రిల్ 10 అనుకున్నారు. కానీ అడివి శేష్ డెకాయిట్ ఉండటంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆగిపోయారు. ఒకవేళ ఏప్రిల్ 17 వస్తుందేమోనని అభిమానులు ఎదురు చూశారు కానీ ఆ అనౌన్స్ మెంట్ కూడా లేదు. అయితే నిఖిల్ బృందం ఎదురు చూస్తోంది రామ్ చరణ్ టీమ్ తీసుకుబోయే నిర్ణయం కోసమని ఇన్ సైడ్ టాక్.
ఈ క్షణం వరకు పెద్ది విడుదల తేదీ ఏప్రిల్ 30 అని బుచ్చిబాబు, నిర్మాతలు నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా మూవీస్ చెప్పిన మాట మీద నిలబడే పరిస్థితులు లేవు. అందులోనూ ఇంకా ఐటెం సాంగ్ షూట్, రీ రికార్డింగ్ పెద్ది వైపు నుంచి బాలన్స్ ఉన్నాయి. ప్రమోషన్లు మొదలుపెట్టనే లేదు. నార్త్ ఇండియా హక్కులు జియో స్టూడియోస్ కొనేశాక పబ్లిసిటీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా చేయాల్సి ఉంటుంది.
సో చివరి నిమిషంలో ట్విస్టు ఇస్తూ పెద్ది కనక పోస్టుపోన్ అయ్యే పక్షంలో క్షణం ఆలోచించకుండా ఏప్రిల్ 30కి స్వయంభు దింపాలనేది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. అధికారిక ప్రకటనలు వచ్చేవరకు ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ మొత్తానికి వీటికి సంబంధించిన హాట్ డిస్కషన్స్ అయితే అంతర్గతంగా జరుగుతున్న మాట వాస్తవం. ఒకవేళ పెద్ది ఓవర్సీస్ బుకింగ్స్ ఏప్రిల్ 8 మొదలుకాకపోతే మటుకు వాయిదా గురించి ఎలాంటి సందేహం పెట్టుకోనక్కర్లేదు.
స్వయంభు మీద నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పట్టుబట్టి సోలో రిలీజ్ కోసం కంకణం కట్టుకున్నాడు. పెద్ది కనక ఛాన్స్ ఇస్తే దాన్ని వాడుకోవడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన స్వయంభులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. బడ్జెట్ భారీగానే ఖర్చయ్యింది. రికవరీ మీద ప్రొడ్యూసర్లు ధీమాగా ఉన్నారు. కంటెంట్ ఆ స్థాయిలో వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఏ డెసిషన్ తీసుకుంటారో.
This post was last modified on March 29, 2026 10:45 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…