‘బాహుబలి’ సినిమాను ముందు ఒక భాగంగానే తీయాలనుకున్నారు. కానీ కథ పెద్దదైపోవడం.. అలాగే ఒక పార్ట్గా తీస్తే కమర్షియల్గా వయబుల్ కాదనిపించడంతో రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేశాడు. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత రెండో భాగంపై అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఆ సమయంలో అందరికీ ‘బాహుబలి-3’ మీద ఆశలు పుట్టాయి.
ఇంత విజయవంతమైన ఫ్రాంఛైజీని రెండో భాగంతోనే ఎందుకు ముగించాలి.. కథను పొడిగించి మూడో పార్ట్ కూడా తీస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి అలా చేయడానికి అంగీకరించలేదు. ఈ కథను ఇంకా సాగదీస్తే బాగోదన్నాడు. ‘ది కంక్లూజన్’తో బాహుబలి సిరీస్కు తెరదించాడు. బాహుబలి-3 గురించి అడిగితే.. ఆ ప్రపంచాన్ని కొనసాగిస్తూ ఆ తరహా సినిమా ఇంకోటి సినిమా తీస్తానేమో ‘బాహుబలి’ కథ మాత్రం ‘ది కంక్లూజన్’తో ముగిసిపోయినట్లే అని చెప్పాడు.
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘కేజీఎఫ్’ విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. చాప్టర్-1కు అద్భుతమైన స్పందన రాగా.. సెకండ్ పార్ట్ మీద అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే వాటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరదించాడు.
‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ సెకండ్ చాప్టర్తోనే ముగిసిపోతుందని చెప్పాడు. ఇంకో పార్ట్ తీయాలంటే కథను అనవసరంగా సాగదీసినట్లే అవుతుందని.. ఈ కథకు న్యాయం జరగదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను కథ విషయంలో అలా రాజీ పడలేనని అన్నాడు. తనకు కానీ, నిర్మాతలకు కూడా ‘కేజీఎఫ్’ను పొడిగించే ఉద్దేశాలు లేవని.. ‘కేజీఎఫ్’ తర్వాత తాను వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతున్నానని చెప్పాడు. రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ ముగుస్తుంది. చాప్టర్-2లో అతడి ఆధిపత్యం.. అధీరాతో పోరు.. వ్యవస్థలకే సవాలుగా మారిన రాకీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం.. చివరికి అతడిని అంతమొందించడంతో కథ ముగుస్తుందని సమాచారం.
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…