‘బాహుబలి’ సినిమాను ముందు ఒక భాగంగానే తీయాలనుకున్నారు. కానీ కథ పెద్దదైపోవడం.. అలాగే ఒక పార్ట్గా తీస్తే కమర్షియల్గా వయబుల్ కాదనిపించడంతో రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేశాడు. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత రెండో భాగంపై అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఆ సమయంలో అందరికీ ‘బాహుబలి-3’ మీద ఆశలు పుట్టాయి.
ఇంత విజయవంతమైన ఫ్రాంఛైజీని రెండో భాగంతోనే ఎందుకు ముగించాలి.. కథను పొడిగించి మూడో పార్ట్ కూడా తీస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి అలా చేయడానికి అంగీకరించలేదు. ఈ కథను ఇంకా సాగదీస్తే బాగోదన్నాడు. ‘ది కంక్లూజన్’తో బాహుబలి సిరీస్కు తెరదించాడు. బాహుబలి-3 గురించి అడిగితే.. ఆ ప్రపంచాన్ని కొనసాగిస్తూ ఆ తరహా సినిమా ఇంకోటి సినిమా తీస్తానేమో ‘బాహుబలి’ కథ మాత్రం ‘ది కంక్లూజన్’తో ముగిసిపోయినట్లే అని చెప్పాడు.
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘కేజీఎఫ్’ విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. చాప్టర్-1కు అద్భుతమైన స్పందన రాగా.. సెకండ్ పార్ట్ మీద అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే వాటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరదించాడు.
‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ సెకండ్ చాప్టర్తోనే ముగిసిపోతుందని చెప్పాడు. ఇంకో పార్ట్ తీయాలంటే కథను అనవసరంగా సాగదీసినట్లే అవుతుందని.. ఈ కథకు న్యాయం జరగదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను కథ విషయంలో అలా రాజీ పడలేనని అన్నాడు. తనకు కానీ, నిర్మాతలకు కూడా ‘కేజీఎఫ్’ను పొడిగించే ఉద్దేశాలు లేవని.. ‘కేజీఎఫ్’ తర్వాత తాను వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతున్నానని చెప్పాడు. రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ ముగుస్తుంది. చాప్టర్-2లో అతడి ఆధిపత్యం.. అధీరాతో పోరు.. వ్యవస్థలకే సవాలుగా మారిన రాకీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం.. చివరికి అతడిని అంతమొందించడంతో కథ ముగుస్తుందని సమాచారం.
This post was last modified on December 23, 2020 6:52 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…