‘బాహుబలి’ సినిమాను ముందు ఒక భాగంగానే తీయాలనుకున్నారు. కానీ కథ పెద్దదైపోవడం.. అలాగే ఒక పార్ట్గా తీస్తే కమర్షియల్గా వయబుల్ కాదనిపించడంతో రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేశాడు. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత రెండో భాగంపై అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఆ సమయంలో అందరికీ ‘బాహుబలి-3’ మీద ఆశలు పుట్టాయి.
ఇంత విజయవంతమైన ఫ్రాంఛైజీని రెండో భాగంతోనే ఎందుకు ముగించాలి.. కథను పొడిగించి మూడో పార్ట్ కూడా తీస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి అలా చేయడానికి అంగీకరించలేదు. ఈ కథను ఇంకా సాగదీస్తే బాగోదన్నాడు. ‘ది కంక్లూజన్’తో బాహుబలి సిరీస్కు తెరదించాడు. బాహుబలి-3 గురించి అడిగితే.. ఆ ప్రపంచాన్ని కొనసాగిస్తూ ఆ తరహా సినిమా ఇంకోటి సినిమా తీస్తానేమో ‘బాహుబలి’ కథ మాత్రం ‘ది కంక్లూజన్’తో ముగిసిపోయినట్లే అని చెప్పాడు.
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘కేజీఎఫ్’ విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. చాప్టర్-1కు అద్భుతమైన స్పందన రాగా.. సెకండ్ పార్ట్ మీద అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే వాటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరదించాడు.
‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ సెకండ్ చాప్టర్తోనే ముగిసిపోతుందని చెప్పాడు. ఇంకో పార్ట్ తీయాలంటే కథను అనవసరంగా సాగదీసినట్లే అవుతుందని.. ఈ కథకు న్యాయం జరగదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను కథ విషయంలో అలా రాజీ పడలేనని అన్నాడు. తనకు కానీ, నిర్మాతలకు కూడా ‘కేజీఎఫ్’ను పొడిగించే ఉద్దేశాలు లేవని.. ‘కేజీఎఫ్’ తర్వాత తాను వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతున్నానని చెప్పాడు. రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ ముగుస్తుంది. చాప్టర్-2లో అతడి ఆధిపత్యం.. అధీరాతో పోరు.. వ్యవస్థలకే సవాలుగా మారిన రాకీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం.. చివరికి అతడిని అంతమొందించడంతో కథ ముగుస్తుందని సమాచారం.
This post was last modified on December 23, 2020 6:52 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…