ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ఎల్లకాలం టాప్ ఫామ్లో ఉండడం సాధ్యం కాదు. తెలుగులో రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ.. తమిళంలో భారతీరాజా, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు చాలామంది టచ్ కోల్పోయి పేలవమైన సినిమాలు చేసిన వాళ్లే. ఐతే ఇలాంటి లెజెండరీ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు తమ పనైపోయిందని గుర్తించి సినిమాలు ఆపేయడానికి చాలా టైం పడుతుంటుంది.
తాము ఫామ్ కోల్పోయామని అంగీకరించడానికి చాలామంది దర్శకులకు మనసొప్పదు. ఐతే టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన వి.వి.వినాయక్కు మాత్రం కొంచెం త్వరగానే తత్వం బోధపడినట్లుంది. ఆయన చివరగా తీసిన ఛత్రపతి హిందీ రీమేక్ పెద్ద డిజాస్టర్ అయింది. తెలుగులో కొన్నేళ్ల ముందు సాయిధరమ్ తేజ్తో ఇంటిలిజెంట్ అనే మూవీ చేస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో వినాయక్ దర్శకుడిగా ప్రయత్నాలు ఆపేసినట్లున్నారు.
ఒక దశ దాటాక సినిమాలు ఎందుకు ఆపేయాలో ఆయన తాజాగా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. మన దగ్గర కొత్త ఐడియాలు లేనపుడు సైలెంట్గా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం బెటర్. అంతే కానీ అప్పుడెప్పుడో సుమోలు ఎగరేశాం అని ఇప్పుడు కూడా అవే కథలు రాసి సినిమాలు తీస్తే జనాలకు చిరాకేస్తుంది.
నేను పని చేసిన హీరోల దగ్గరికి వెళ్లి సినిమా చేద్దాం అంటే మొహమాటానికి ఒప్పుకుంటారు. కానీ అలా చేయకూడదు అంటూ కుండబద్దలు కొట్టేశారు వినాయక్. మరోవైపు వినాయక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన అదుర్స్కు సీక్వెల్ చేయాలని ఉందంటూ రచయిత కోన వెంకట్ తరచుగా మాట్లాడుతుంటారు. దీనిపైనా వినాయక్ భలే స్టేట్మెంట్ ఇచ్చాడు.
నిజంగా చెప్పాలంటే అదుర్స్ సినిమా అక్కడితో అయిపోయిది. అందులో ఒక సీక్వెల్ తీయడానికి ఏమీ మిగలలేదు. బలవంతంగా తీసినా మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదు. దాన్ని అలాగే వదిలేయడం మంచిది అని తేల్చి చెప్పాడు వినాయక్. దీంతో అదుర్స్ సీక్వెల్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఈ రెండు స్టేట్మెంట్లతో వినాయక్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు.
This post was last modified on March 24, 2026 10:05 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…