ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఆయన పక్కనే ఉన్న హీరో శ్రీలీల సడన్గా వెనక్కి తిరిగి చూసింది. తన వెనుకే ఉన్న జబర్దస్త్ కమెడియన్, ‘రంగస్థలం’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన మహేష్ నవ్వాడు. కానీ శ్రీలీల నవ్వలేదు. సీరియస్ లుక్ ఇచ్చింది.
దీంతో మహేష్ ఏదో చేసి ఉంటాడంటూ అతన్ని ట్రోల్ చేశారు నెటిజన్లు. అదే సమయంలో అతడి పట్ల శ్రీలీల అమర్యాదకరంగా వ్యవహరించిందంటూ కొందరు కామెంట్లు చేశారు. దీనిపై ఇప్పటికే మహేష్ క్లారిటీ ఇచ్చాడు. అంతకుముందు శ్రీలీల తన ఫోన్ పట్టుకోమని తనకిచ్చిందని.. ఆమె వెనక్కి తిరిగి తన వైపు చూసేసరికి ఫోన్ కోసం చూస్తోందని అనుకున్నానని.. ఈ లోపు శ్రీలీల స్క్రీన్ వైపు పైకి చూసిందని అంటూ అంతకుమించి ఏమీ జరగలేదని స్పష్టం చేశాడు మహేష్.
ఇప్పుడీ వివాదం గురించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో శ్రీలీల కూడా స్పందించింది. ఆ రోజు అసలే వివాదం లేదని.. ఎవ్వరూ ఏమీ మాట్లాడని వీడియో చూసి ఏదేదో ఊహించుకుంటున్నారని ఆమె స్పష్టం చేసింది. మహేష్తో సినిమాలో తనకు కాంబినేషన్ సీన్లు చాలా ఉన్నాయని, తనతో మంచి స్నేహం ఉందని ఆమె చెప్పింది.
స్టేజ్ మీదికి వెళ్లేటపుడు మహేష్ తనకు సాయం చేశాడని, తన ఫోన్ అతడికి ఇచ్చానని ఆమె వెల్లడించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నపుడు ఏదో సౌండ్ రావడంతో అది తన మొబైల్ సౌండేమో అని తాను వెనక్కి తిరిగి చూశానని.. తాను ఫోన్ అడుగుతున్నానేమో అనుకుని మహేష్ తన వైపు చూశాడని.. అందరి దృష్టీ పవన్ స్పీచ్ మీద ఉండడంతో అంతకుమించి ఎక్కువ ఏమీ ఆలోచించలేదని శ్రీలీల చెప్పింది.
కానీ మాటలు లేని ఈ వీడియో చూసి జనాలు రకరకాల ఊహాగానాలు సృష్టిస్తున్నారని.. తన దృష్టికి కూడా ఈ వీడియో వచ్చిందని ఆమె చెప్పారు. సెలబ్రెటీల గురించి ఇలా ఏదేదో మాట్లాడేస్తుంటారని.. కానీ తమ నోటి నుంచి ఏదైనా చెప్పే వరకు దేని మీదా ఒక అంచనాకు రావద్దని ఆమె స్పష్టం చేశారు. శ్రీలీల ఇలా స్పందించడంతో ఆ వివాదానికి ఇంతటితో తెరపడినట్లయింది.
This post was last modified on March 18, 2026 11:43 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…