Political News

పోలవరం నిర్వాసితులకు పండగే పండగ.. 226 కోట్లు జమ!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిహారంలో కొంత మొత్తాన్ని తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా వారికి అందించారు. ఉగాది పండుగ సందర్భంగా వారిలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైసీపీ హయాంలో నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గారని విమర్శించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చిన తర్వాత పోలవరం ప్రాంతాన్ని రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో ఇకపై పోలవరం అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు.

ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వారి ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రాం వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని చంద్రబాబు తెలిపారు. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామని, గత దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లను ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇప్పుడు మూడో విడతగా ఉగాది సందర్భంగా రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని వెల్లడించారు.

This post was last modified on March 19, 2026 11:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీరభద్రుడు చాలా మాస్ ఉన్నాడు

సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…

18 minutes ago

విజ‌య్ అలా… ఉద‌య‌నిధి ఇలా

త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక కొన్ని రోజుల పాటు న‌డిచిన డ్రామాకు ఆదివారం తెర‌ప‌డి, ఆదివారం నాడు త‌మిళ…

34 minutes ago

నంబర్ వన్ కమెడియన్లు ఒక్కటయ్యారు

తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…

2 hours ago

బండి వివాదంపై తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…

3 hours ago

త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…

4 hours ago

మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం… వాహ్!

తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…

4 hours ago