Political News

పోలవరం నిర్వాసితులకు పండగే పండగ.. 226 కోట్లు జమ!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిహారంలో కొంత మొత్తాన్ని తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా వారికి అందించారు. ఉగాది పండుగ సందర్భంగా వారిలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైసీపీ హయాంలో నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గారని విమర్శించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చిన తర్వాత పోలవరం ప్రాంతాన్ని రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో ఇకపై పోలవరం అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు.

ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వారి ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రాం వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని చంద్రబాబు తెలిపారు. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామని, గత దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లను ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇప్పుడు మూడో విడతగా ఉగాది సందర్భంగా రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని వెల్లడించారు.

This post was last modified on March 19, 2026 11:04 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

6 minutes ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

2 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

2 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

3 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

4 hours ago