అల్లు వారి ఓటీటీ ఆహా కోసం కొత్త కంటెంట్ కోసం పెద్ద స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే సామ్ జామ్ సహా కొన్ని కొత్త షోలను మొదలుపెట్టారు. అలాగే వరుసబెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహా కోసం పెద్ద సంఖ్యలోనే వెబ్ సిరీస్లు తయారవుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నటీనటులు చాలామందే ఇందులో భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు ఇతర భాషల వాళ్లనూ లైన్లో పెడుతున్నారు అల్లు వారు. బహుభాషా నటి అమలా పాల్.. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ కలిసి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతుండటం విశేషం.
ఈ సిరీస్కు టైటిల్ కూడా ఖరారైంది. కుడి ఎడమైతే.. అంటూ పక్కా తెలుగు టైటిల్తో ఈ కన్నడ దర్శకుడు, మలయాళ నటి ఓ సిరీస్ చేయబోతున్నారు. ఇదొక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న సిరీస్ అంటున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయట.
పవన్ కుమార్ లూసియా సినిమాతో ఇండస్ట్రీలోకి బ్యాంగ్ బ్యాంaxగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతను తీసిన యు టర్న్ కూడా సెన్సేషనల్ హిట్టయింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సమంత ప్రధాన పాత్రలో తెలుగులో తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడతను ఆహా కోసం తెలుగులో వెబ్ సిరీస్ చేయడం విశేషమే. బహుశా ఇందులో సమంత హ్యాండ్ కూడా ఉంటే ఉండొచ్చేమో. త్వరలోనే ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on December 23, 2020 9:25 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…