అల్లు వారి ఓటీటీ ఆహా కోసం కొత్త కంటెంట్ కోసం పెద్ద స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే సామ్ జామ్ సహా కొన్ని కొత్త షోలను మొదలుపెట్టారు. అలాగే వరుసబెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహా కోసం పెద్ద సంఖ్యలోనే వెబ్ సిరీస్లు తయారవుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నటీనటులు చాలామందే ఇందులో భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు ఇతర భాషల వాళ్లనూ లైన్లో పెడుతున్నారు అల్లు వారు. బహుభాషా నటి అమలా పాల్.. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ కలిసి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతుండటం విశేషం.
ఈ సిరీస్కు టైటిల్ కూడా ఖరారైంది. కుడి ఎడమైతే.. అంటూ పక్కా తెలుగు టైటిల్తో ఈ కన్నడ దర్శకుడు, మలయాళ నటి ఓ సిరీస్ చేయబోతున్నారు. ఇదొక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న సిరీస్ అంటున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయట.
పవన్ కుమార్ లూసియా సినిమాతో ఇండస్ట్రీలోకి బ్యాంగ్ బ్యాంaxగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతను తీసిన యు టర్న్ కూడా సెన్సేషనల్ హిట్టయింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సమంత ప్రధాన పాత్రలో తెలుగులో తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడతను ఆహా కోసం తెలుగులో వెబ్ సిరీస్ చేయడం విశేషమే. బహుశా ఇందులో సమంత హ్యాండ్ కూడా ఉంటే ఉండొచ్చేమో. త్వరలోనే ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లనుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…