Movie News

అమ‌ల‌-ప‌వ‌న్.. కుడి ఎడ‌మైతే

అల్లు వారి ఓటీటీ ఆహా కోసం కొత్త కంటెంట్ కోసం పెద్ద స్థాయిలోనే స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్యే సామ్ జామ్ స‌హా కొన్ని కొత్త షోల‌ను మొద‌లుపెట్టారు. అలాగే వ‌రుస‌బెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహా కోసం పెద్ద సంఖ్య‌లోనే వెబ్ సిరీస్‌లు త‌యార‌వుతున్నాయి.

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు చాలామందే ఇందులో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఇప్పుడు ఇత‌ర భాషల వాళ్ల‌నూ లైన్లో పెడుతున్నారు అల్లు వారు. బ‌హుభాషా న‌టి అమ‌లా పాల్‌.. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ క‌లిసి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయ‌బోతుండ‌టం విశేషం.

ఈ సిరీస్‌కు టైటిల్ కూడా ఖ‌రారైంది. కుడి ఎడ‌మైతే.. అంటూ ప‌క్కా తెలుగు టైటిల్‌తో ఈ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, మ‌ల‌యాళ న‌టి ఓ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇదొక థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న సిరీస్ అంటున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయ‌ట‌.

ప‌వ‌న్ కుమార్ లూసియా సినిమాతో ఇండ‌స్ట్రీలోకి బ్యాంగ్ బ్యాంaxగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత అత‌ను తీసిన యు ట‌ర్న్ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగులో తీశాడు. అది ఓ మోస్త‌రుగా ఆడింది. ఇప్పుడ‌త‌ను ఆహా కోసం తెలుగులో వెబ్ సిరీస్ చేయ‌డం విశేష‌మే. బ‌హుశా ఇందులో స‌మంత హ్యాండ్ కూడా ఉంటే ఉండొచ్చేమో. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్ల‌నుంది.

This post was last modified on December 23, 2020 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డెకాయిట్ ఛాన్సుకి అదొక్కటే అడ్డంకి

ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…

36 minutes ago

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

2 hours ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

2 hours ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

4 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

7 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

10 hours ago