Movie News

కమల్ కు చిన్మయి చురకలు

మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి, సినీ రంగంలో ఎంతోమంది మహిళలు గళం విప్పేలా చేసిన ఘనత సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సొంతం. చాలామంది నెమ్మదిగా ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు కానీ.. చిన్మయి మాత్రం పట్టు వదల్లేదు.

ఒకవైపు తనకు జరిగిన అన్యాయం గురించి పదే పదే గుర్తు చేస్తూనే, మరోవైపు ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల్లో మహిళల మీద జరిగే అఘాయిత్యాల విషయంలో ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది చిన్మయి. ముఖ్యంగా తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద ఆమె చేసిన ఆరోపణలు.. చేసిన పోరాటం చర్చనీయాంశంగా మారింది.

కానీ చిన్మయి ఎన్ని ఆరోపణలు చేసినా.. ఫిర్యాదులు చేసినా.. ఎన్ని ఉదంతాలను ఉదాహరణగా చూపించినా.. వైరముత్తు మీద ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. సినీ, రాజకీయ ప్రముఖులతో వైరముత్తుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన దర్జాగా తిరిగేస్తున్నారని.. తమకు న్యాయం చేయట్లేదని చిన్మయి ఆరోపిస్తూ వస్తోంది. వైరముత్తు గురించి ఎవరు పాజిటివ్ గా మాట్లాడినా ఆమె ఊరుకోవట్లేదు.

తాజాగా లెజెండరీ నటుడు కమల్ హాసన్ వైరముత్తును కొనియాడుతూ ఒక పోస్టు పెడితే.. చిన్మయి ఆయననూ తప్పుబట్టింది. కొంచెం ఘాటుగానే కమల్ మీద విమర్శలు చేసింది. వైరముత్తుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కమల్ పోస్టు పెట్టాడు. ఈ సందర్భంగా వైరముత్తును ‘అంకుల్ మెంటార్’ అని సంబోధించాడు కమల్. చిన్మయి ఇదే విషయాన్ని ఎత్తు చూపుతూ కోట్ చేసింది.

సదరు అంకుల్ – మెంటార్ మహిళలకు చేసిన అన్యాయాల గురించి ఎంతగా మొర పెట్టుకున్నా.. సినీ రంగంలో పేరొంది, రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నవాళ్ళు మహిళల బాధలను అసలు వినిపించుకోరని చిన్మయి కమల్ కు చురకలంటించింది. పురుషులు ఎప్పుడూ మహిళల వైపు ఉండరని.. వాళ్లందరూ వాళ్ళ అన్నతమ్ములు, మామలు, తండ్రులు, స్నేహితులు, మెంటార్ల వైపే నిలుస్తారని.. ఎంతో మనోవేదన అనుభవించిన మహిళల గోడు పట్టేది ఎవరికని చిన్మయి ప్రశ్నించింది.

Kumar

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago