మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి, సినీ రంగంలో ఎంతోమంది మహిళలు గళం విప్పేలా చేసిన ఘనత సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సొంతం. చాలామంది నెమ్మదిగా ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు కానీ.. చిన్మయి మాత్రం పట్టు వదల్లేదు.
ఒకవైపు తనకు జరిగిన అన్యాయం గురించి పదే పదే గుర్తు చేస్తూనే, మరోవైపు ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల్లో మహిళల మీద జరిగే అఘాయిత్యాల విషయంలో ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది చిన్మయి. ముఖ్యంగా తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద ఆమె చేసిన ఆరోపణలు.. చేసిన పోరాటం చర్చనీయాంశంగా మారింది.
కానీ చిన్మయి ఎన్ని ఆరోపణలు చేసినా.. ఫిర్యాదులు చేసినా.. ఎన్ని ఉదంతాలను ఉదాహరణగా చూపించినా.. వైరముత్తు మీద ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. సినీ, రాజకీయ ప్రముఖులతో వైరముత్తుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన దర్జాగా తిరిగేస్తున్నారని.. తమకు న్యాయం చేయట్లేదని చిన్మయి ఆరోపిస్తూ వస్తోంది. వైరముత్తు గురించి ఎవరు పాజిటివ్ గా మాట్లాడినా ఆమె ఊరుకోవట్లేదు.
తాజాగా లెజెండరీ నటుడు కమల్ హాసన్ వైరముత్తును కొనియాడుతూ ఒక పోస్టు పెడితే.. చిన్మయి ఆయననూ తప్పుబట్టింది. కొంచెం ఘాటుగానే కమల్ మీద విమర్శలు చేసింది. వైరముత్తుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కమల్ పోస్టు పెట్టాడు. ఈ సందర్భంగా వైరముత్తును ‘అంకుల్ మెంటార్’ అని సంబోధించాడు కమల్. చిన్మయి ఇదే విషయాన్ని ఎత్తు చూపుతూ కోట్ చేసింది.
సదరు అంకుల్ – మెంటార్ మహిళలకు చేసిన అన్యాయాల గురించి ఎంతగా మొర పెట్టుకున్నా.. సినీ రంగంలో పేరొంది, రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నవాళ్ళు మహిళల బాధలను అసలు వినిపించుకోరని చిన్మయి కమల్ కు చురకలంటించింది. పురుషులు ఎప్పుడూ మహిళల వైపు ఉండరని.. వాళ్లందరూ వాళ్ళ అన్నతమ్ములు, మామలు, తండ్రులు, స్నేహితులు, మెంటార్ల వైపే నిలుస్తారని.. ఎంతో మనోవేదన అనుభవించిన మహిళల గోడు పట్టేది ఎవరికని చిన్మయి ప్రశ్నించింది.
This post was last modified on March 15, 2026 4:11 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…