గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్ అని మన వాళ్లు ఎంతమాత్రం ఫీలవ్వరు. ‘ఫిదా’తో మొదలుకుని పలు చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుని గొప్ప పేరు సంపాదించింది సాయిపల్లవి. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సాయిపల్లవిని కూడా కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా టార్గెట్ చేస్తుంటారు.
కొన్నేళ్ల ముందు ఒక ఇంటర్వ్యూలో పాకిస్థాన్ వాళ్లు కూడా మన లాంటి మనుషులే.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన తన మీద నెగెటివిటీ వచ్చింది. అంతకుమించి సాయిపల్లవి ఎప్పుడూ హద్దులు దాటి మాట్లాడింది లేదు, ప్రవర్తించింది లేదు. అయినా సరే.. ఆమె మీద కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం.. ట్రోల్స్ చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. సాయిపల్లవి ప్రస్తుతం ‘రామాయణం’ లాంటి మెగా మూవీలో సీత పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆమె ఎంపికైన దగ్గర్నుంచి ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి.. సీత పాత్ర చేయడం ఏంటన్నట్లుగా మాట్లాడుతోంది. ఆ వర్గం ఎంతకీ ఆమెను వదలట్లేదు. తాజాగా రామాయణంలో రణబీర్, సాయిపల్లవికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆ ఇద్దరూ రాముడు, సీత అవతారాల్లో కనిపిస్తున్నారు. అది ముందు లీక్డ్ పిక్ అనుకున్నారు. కానీ ఏఐ ద్వారా క్రియేట్ చేసిందని తర్వాత క్లారిటీ వచ్చింది.
ఐతే ఈ ఫొటోను పట్టుకుని సాయిపల్లవి సీత పాత్రకు మిస్ ఫిట్ అంటూ.. ఈ సినిమా తన వల్లే నాశనం కాబోతోందంటూ ఒక వర్గం అదే పనిగా దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలోకి వచ్చిన ఫొటో ఒరిజినలా కాదా అని కూడా వెరిఫై చేసుకోకుండా ఒక అజెండా ప్రకారం సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్ టైంకి ఈ వ్యతిరేక ప్రచారం ఇంకా పెద్ద స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది. ఈ నెగెటివిటీని టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
This post was last modified on March 9, 2026 4:17 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…