Movie News

ఉదయం వస్తేనే మంచిది ఉస్తాద్

ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం దురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనమా లేక ఇంకేదైనా ఉందా అంటే కాస్త లోతుగా విశ్లేషించుకోవాలి.

మాస్ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఎంతైనా రిస్కుతో కూడుకున్నదే. ఒక్కోసారి యావరేజ్ టాక్ ని ఫ్లాప్ గా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఓజి రేంజ్ లో హడావిడి లేదు కాబట్టి మౌత్ టాక్ ప్రాపర్ గా రావాలి. నాలుగు గంటల దురంధర్ రివెంజ్ చూసిన కళ్ళతో వెంటనే పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చిన ప్రేక్షకులకు ఆ అలసట ఇబ్బంది పెట్టే ప్రమాదముంది.

అందులోనూ తెలంగాణలో బెనిఫిట్ షో అనుమతుల కోసం ప్రయాస పడటం కంటే నేరుగా ఉదయం నుంచి మొదలుపెట్టడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు. ఇప్పటికైతే మైత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే డబ్బింగ్, రీ రికార్డింగ్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. ఓవర్సీస్ కు హార్డ్ డిస్కులు వీలైనంత త్వరగా పంపించాలి.

ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే చక్కగా మార్చి 19 ఫ్రెష్ గా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం చేయించడం తెలివైన నిర్ణయమే అవుతుంది. తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేసేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల రంగంలోకి దిగింది. రాశిఖన్నా ఎంట్రీ కూడా ఉంటుంది. దేవి, తమన్, ఇతర ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు.

ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ వీకెండ్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ ని కొనసాగించాలంటే దురంధర్ 2కి ధీటుగా టాక్ తెచ్చుకోవాలి. ఎటొచ్చి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటే ఉంటుంది బట్టి బయ్యర్లు ఈ విషయంలో ధీమాగానే ఉన్నారు. తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లు, ఏపీలో కొంత హైక్ తీసుకున్న ధరలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ అవుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం.

Kumar

Recent Posts

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

6 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

6 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

6 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

7 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

8 hours ago

సైలెంటుగా సినిమా చేస్తున్న క్రిష్

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను…

8 hours ago