ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం దురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనమా లేక ఇంకేదైనా ఉందా అంటే కాస్త లోతుగా విశ్లేషించుకోవాలి.
మాస్ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఎంతైనా రిస్కుతో కూడుకున్నదే. ఒక్కోసారి యావరేజ్ టాక్ ని ఫ్లాప్ గా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఓజి రేంజ్ లో హడావిడి లేదు కాబట్టి మౌత్ టాక్ ప్రాపర్ గా రావాలి. నాలుగు గంటల దురంధర్ రివెంజ్ చూసిన కళ్ళతో వెంటనే పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చిన ప్రేక్షకులకు ఆ అలసట ఇబ్బంది పెట్టే ప్రమాదముంది.
అందులోనూ తెలంగాణలో బెనిఫిట్ షో అనుమతుల కోసం ప్రయాస పడటం కంటే నేరుగా ఉదయం నుంచి మొదలుపెట్టడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు. ఇప్పటికైతే మైత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే డబ్బింగ్, రీ రికార్డింగ్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. ఓవర్సీస్ కు హార్డ్ డిస్కులు వీలైనంత త్వరగా పంపించాలి.
ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే చక్కగా మార్చి 19 ఫ్రెష్ గా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం చేయించడం తెలివైన నిర్ణయమే అవుతుంది. తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేసేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల రంగంలోకి దిగింది. రాశిఖన్నా ఎంట్రీ కూడా ఉంటుంది. దేవి, తమన్, ఇతర ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు.
ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ వీకెండ్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ ని కొనసాగించాలంటే దురంధర్ 2కి ధీటుగా టాక్ తెచ్చుకోవాలి. ఎటొచ్చి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటే ఉంటుంది బట్టి బయ్యర్లు ఈ విషయంలో ధీమాగానే ఉన్నారు. తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లు, ఏపీలో కొంత హైక్ తీసుకున్న ధరలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ అవుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం.
This post was last modified on March 8, 2026 7:03 pm
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…