ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం దురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనమా లేక ఇంకేదైనా ఉందా అంటే కాస్త లోతుగా విశ్లేషించుకోవాలి.
మాస్ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఎంతైనా రిస్కుతో కూడుకున్నదే. ఒక్కోసారి యావరేజ్ టాక్ ని ఫ్లాప్ గా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఓజి రేంజ్ లో హడావిడి లేదు కాబట్టి మౌత్ టాక్ ప్రాపర్ గా రావాలి. నాలుగు గంటల దురంధర్ రివెంజ్ చూసిన కళ్ళతో వెంటనే పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చిన ప్రేక్షకులకు ఆ అలసట ఇబ్బంది పెట్టే ప్రమాదముంది.
అందులోనూ తెలంగాణలో బెనిఫిట్ షో అనుమతుల కోసం ప్రయాస పడటం కంటే నేరుగా ఉదయం నుంచి మొదలుపెట్టడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు. ఇప్పటికైతే మైత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే డబ్బింగ్, రీ రికార్డింగ్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. ఓవర్సీస్ కు హార్డ్ డిస్కులు వీలైనంత త్వరగా పంపించాలి.
ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే చక్కగా మార్చి 19 ఫ్రెష్ గా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం చేయించడం తెలివైన నిర్ణయమే అవుతుంది. తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేసేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల రంగంలోకి దిగింది. రాశిఖన్నా ఎంట్రీ కూడా ఉంటుంది. దేవి, తమన్, ఇతర ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు.
ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ వీకెండ్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ ని కొనసాగించాలంటే దురంధర్ 2కి ధీటుగా టాక్ తెచ్చుకోవాలి. ఎటొచ్చి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటే ఉంటుంది బట్టి బయ్యర్లు ఈ విషయంలో ధీమాగానే ఉన్నారు. తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లు, ఏపీలో కొంత హైక్ తీసుకున్న ధరలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ అవుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం.
ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే…
మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్…
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే…
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2022లో థియేటర్లలోకి…