ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం దురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనమా లేక ఇంకేదైనా ఉందా అంటే కాస్త లోతుగా విశ్లేషించుకోవాలి.
మాస్ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఎంతైనా రిస్కుతో కూడుకున్నదే. ఒక్కోసారి యావరేజ్ టాక్ ని ఫ్లాప్ గా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఓజి రేంజ్ లో హడావిడి లేదు కాబట్టి మౌత్ టాక్ ప్రాపర్ గా రావాలి. నాలుగు గంటల దురంధర్ రివెంజ్ చూసిన కళ్ళతో వెంటనే పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చిన ప్రేక్షకులకు ఆ అలసట ఇబ్బంది పెట్టే ప్రమాదముంది.
అందులోనూ తెలంగాణలో బెనిఫిట్ షో అనుమతుల కోసం ప్రయాస పడటం కంటే నేరుగా ఉదయం నుంచి మొదలుపెట్టడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు. ఇప్పటికైతే మైత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకంటే డబ్బింగ్, రీ రికార్డింగ్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. ఓవర్సీస్ కు హార్డ్ డిస్కులు వీలైనంత త్వరగా పంపించాలి.
ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే చక్కగా మార్చి 19 ఫ్రెష్ గా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శనం చేయించడం తెలివైన నిర్ణయమే అవుతుంది. తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేసేందుకు తక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల రంగంలోకి దిగింది. రాశిఖన్నా ఎంట్రీ కూడా ఉంటుంది. దేవి, తమన్, ఇతర ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు.
ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ వీకెండ్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ ని కొనసాగించాలంటే దురంధర్ 2కి ధీటుగా టాక్ తెచ్చుకోవాలి. ఎటొచ్చి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటే ఉంటుంది బట్టి బయ్యర్లు ఈ విషయంలో ధీమాగానే ఉన్నారు. తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లు, ఏపీలో కొంత హైక్ తీసుకున్న ధరలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ అవుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…