దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్ ముందు ఎక్కువ నెగటివిటీనే ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ వస్తున్న టైంలో కేవలం ప్రీమియర్ షోలతోనే రికార్డులు బద్దలు అవ్వడం చూస్తూ బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 35 నుంచి 45 కోట్ల దాకా అడ్వాన్స్ రావొచ్చనే అంచనా షాక్ కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు దురంధర్ రివెంజ్ తో ఈ కథ ఆగిపోవడం లేదట. మూడో భాగం ‘ది వ్రాత్ అఫ్ గాడ్’ పేరుతో ఆదిత్య ధార్ థర్డ్ పార్ట్ సిద్ధం చేస్తున్నాడని వినికిడి. దీనికి సంబంధించిన షూట్ అయ్యిందో లేదో అసలిది పుకారో నిజమో తెలియదు కానీ కార్యరూపం దాలిస్తే మాత్రం సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 3తో సక్సెసైన బాలీవుడ్ మూవీస్ లేవు.
ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది మార్చి 19 ప్రీమియర్ల ఎండ్ టైటిల్స్ చూశాక క్లారిటీ వస్తుంది. అయినా ఏడున్నర గంటల కంటెంట్ ని వెబ్ సిరీస్ లా కాకుండా రెండు భాగాల థియేటర్ మూవీగా మార్చి ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడానికి దారులు వేసుకోవడం ఒక్క ఆదిత్య ధార్ కే చెల్లింది. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు లేవు కానీ మూవీ లవర్స్ అయితే ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక దురంధర్ రివెంజ్ విషయానికి వస్తే ఆల్ టైం రికార్డులకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ బుకింగ్స్ మతులు పోగొడుతున్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సైతం వేగంగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇంకా పది రోజులు ఉంది కాబట్టి రిలీజ్ నాటికి ఇంకా పెద్ద సునామీగా మారడం ఖాయం. ఇప్పటిదాకా కేవలం ప్రీమియర్ల బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు.
ఆదిత్య ధార్ టీమ్ ప్రస్తుతానికి ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. ఇంటర్వ్యూలు ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్టు లేరు. అవును మరి పబ్లిసిటీ అవసరం లేకుండా జనం ఈ స్థాయిలో సినిమా చూసేందుకు ఉవ్విళ్ళూరుతుంటే అంతకంటే ఏం కావాలి. ఈసారి రివెంజ్ లో అక్షయ్ ఖన్నా లేడు కాబట్టి పూర్తి డామినేషన్ రణ్వీర్ సింగ్ దే ఉంటుందని అంటున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉంటాయి కాబట్టి పీక్స్ పెర్ఫార్మన్స్ చూడొచ్చు.
This post was last modified on March 8, 2026 6:57 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…