దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు హఠాత్తుగా వాయిదా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని కారణంగా చెప్పుకున్నారు కానీ పోటీ వల్లే నిర్ణయం మార్చుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అందులోనూ ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో యష్ బృందం వెనుకడుగు వేయక తప్పలేదు.
దీన్ని గ్రేటెస్ట్ ఎస్కేప్ అఫ్ ది డికేడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దురంధర్ ది రివెంజ్ నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ నోరెళ్లబెడుతోంది. కేవలం ప్రీమియర్ షోలకు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పన్నెండు కోట్లకు పైగా వసూలు కావడం ఊహించని రికార్డు. ఈ మూవీ మీద జనంలో విపరీతమైన ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ అది ఈ స్థాయిలో అనేది బహుశా దర్శక నిర్మాతలైనా ఊహించారో లేదో.
ఒకవేళ టాక్సిక్ కనక మాట మార్చకుండా కాంపిటీషన్ కు సిద్ధపడి ఉంటే దారుణంగా ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలన్నీ దురంధర్ రివెంజ్ ఫీవర్ లో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వైపు బయ్యర్లు ఈ సినిమా తప్ప వేరే షో వేసేందుకు ఇష్టపడటం లేదు. అందులోనూ 3 గంటల 55 నిమిషాల నిడివి కాబట్టి రోజుకు నాలుగు కంటే ఎక్కువ షోలకు ఛాన్స్ లేదు. అందుకే స్క్రీన్లు పెంచి కలెక్షన్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు.
ఈ సునామీని తట్టుకోవడం టాక్సిక్ కు ఖచ్చితంగా కష్టం అయ్యేది. అందులోనూ టీజర్ వచ్చి అంచనాలను విపరీతంగా పెంచలేకపోయింది. దీనికి కొన్ని కోర్టు వివాదాలు, సెన్సార్ చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున సావధానంగా వాటిని పరిష్కరించుకోవాలి.
టాక్సిక్ టీమ్ ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఈ రిస్క్ లేదు. టార్గెట్ చేసింది కేవలం తెలుగు మార్కెట్లనే కాబట్టి మంచి టాక్ వస్తే చాలు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ వసూళ్ళలో గట్టెక్కిపోతుంది. మొత్తానికి టాక్సిక్ అయితే భలే తప్పించుకుందనేది ఎవరూ కాదనలేని ఓపెన్ కామెంట్.
This post was last modified on March 8, 2026 1:00 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…