ఒక సీక్వెల్ కి విపరీతమైన హైప్ రావడం బాహుబలి, కెజిఎఫ్, పుష్పకు చూశాం. అవి మొదటి భాగాలు రిలీజ్ కాకముందే బజ్ తెచ్చుకున్నవి. కానీ దురంధర్ కేసు అది కాదు. గత డిసెంబర్ లో విడుదల ముందు రోజు ప్రెస్ ప్రీమియర్ క్యాన్సిల్ అయ్యింది. ట్రైలర్ మీద పాజిటివ్ టాక్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఊపులో లేవు. కట్ చేస్తే బాలీవుడ్ చరిత్రను ఆ మూవీ తిరగరాస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుందని తలలు పండిన ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు దురంధర్ ది రివెంజ్ వరస చూస్తుంటే దానికి మించిపోయేలా ఉంది. కేవలం ప్రీమియర్ షో టికెట్లతోనే ఇప్పటికే పది కోట్లు వసూలైనట్టు ట్రేడ్ టాక్. సుమారుగా రెండు లక్షలకు దగ్గరగా టికెట్లు అమ్ముడుపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా పది రోజుల టైం ఉంది .
ఇప్పుడే ఇలా ఉంటే పద్దెనిమిది తేదీ ఉదయానికి విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ తట్టుకోలేక ముంబై లాంటి నగరాల్లో మధ్యాన్నం రెండు గంటల నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. అంటే అఫీషియల్ గా ప్రకటించిన అయిదు గంటల కన్నా ముందే షోలు పడబోతున్నాయి. దీన్ని బట్టి ఓపెనింగ్ ఫిగర్ ఎంత పెద్ద నెంబర్ వస్తుందో ఊహకు అందటం లేదు.
ఓవరాల్ గా ఇండియా, ఓవర్సీస్ కలిపి ఓపెనింగ్ డే గ్రాస్ రెండు వందల కోట్లు దాటవచ్చని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. నాలుగు గంటల నిడివి కావడంతో షోలు షెడ్యూల్స్ చేయడం థియేటర్లకు పెద్ద సమస్యగా మారింది. అయిదు షోలకు అనుమతి ఉన్నా నాలుగు షోలకే పదిహేడు గంటల సమయం అయిపోతుంది.
అంటే స్టాఫ్ పగలు రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సిబ్బంది పనిభారంతో ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. హైదరాబాద్ లోనే 18 రాత్రిలోపు మూడు వందలకు పైగా షోలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజమయ్యేలా ఉంది.
This post was last modified on March 8, 2026 12:15 am
అన్ని కంటెంట్లు థియేటర్లకు సూట్ కావు. ఇది జడ్జ్ చేసే విషయంలో ఏ మాత్రం తొందరపడ్డా, అతివిశ్వాసం చూపించినా బోల్తా…
నేపాల్ రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద మార్పు చోటుచేసుకుంది. దేశంలో దశాబ్దాలుగా ఏలుతున్న పాత తరం నాయకులను…
తమిళనాట టీవీకే పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్నికల పోటీకి సై అంటున్న తమిళ అగ్ర కథానాయకుడు విజయ్.. ఇటీవల…
ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తోంది ప్రియమణి. కెరీర్ ఆరంభంలోనూ ఆమె సంప్రదాయ పాత్రలే చేసింది. అలాంటి అమ్మాయి..…
వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా…
ప్రపంచంలోని పలు దేశాల్లో వృద్ధ జనాభా ఇప్పుడు పెను సవాలుగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మనదేశం మాత్రమే ప్రస్తుతం…