రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్ తెచ్చుకున్న మూవీ ఇదే. సింగల్ తర్వాత శ్రీవిష్ణు మళ్ళీ తెరమీద కనిపించలేదు. నారి నారి నడుమ మురారిలో చిన్న క్యామియో చేశాడు కానీ అది కౌంట్ లోకి రాదు.
రాజ రాజా చోర టైంలో చూపించిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ అదే స్థాయిలో వ్యక్తం చేయడం చూస్తుంటే కంటెంట్ బాగానే వచ్చినట్టు అనిపిస్తోంది. యూత్ ని టార్గెట్ చేసుకున్న ట్రైలర్ వాళ్లలో అంచనాలు రేపడంలో సక్సెసయ్యింది. ఫ్యామిలీస్ ఇంకా ఏ మేరకు టర్న్ అవుతారనేది రేపు ఉదయం టాక్, రివ్యూలను బట్టి ఉంటుంది.
విష్ణు పంట పండినట్టే అని హెడ్డింగ్ పెట్టడానికి కారణం ఉంది. ఏపీ తెలంగాణలోనే కాదు అటు ఓవర్సీస్ లోనూ తెలుగు జనాలకు సరైన సినిమా లేక థియేటర్లకు దూరంగా ఉంటున్నారు. ఓ మోస్తరుగా కపుల్ ఫ్రెండ్లీ బండి లాగింది కానీ దాని ప్రభావం ఏ సెంటర్లకే పరిమితమయ్యింది. హడావిడి చేసిన ఫంకీ, హే బలవంత్ మొదటి వీకెండ్ కే చేతులు ఎత్తేశాయి.
సీత పయనం లాంటి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. సో నెల రోజులకు పైగానే బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంటోంది. ఉదయం నిద్రలేచే థియేటర్ యజమాని ఆ రోజు ఎన్ని షోలు పడతాయో, ఎన్ని క్యాన్సిల్ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పబ్లిక్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఒకవేళ యునానిమస్ వస్తే మాత్రం కెరీర్ బెస్ట్ నమోదు అయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.
కేవలం వారం గ్యాప్ లో మార్చి 6 శ్రీవిష్ణు మరో సినిమా మృత్యుంజయ్ వస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఫస్ట్ వీక్ నే టార్గెట్ గా పెట్టుకుంది టీమ్. ఇంటర్, పది పరీక్షల వల్ల ఆక్యుపెన్సీలు కొంత ప్రభావితం చెందుతున్నా యూత్ అండ్ మాస్ ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు రెడీగా ఉన్నారు. విన్యాసాలు వాళ్ళను మెప్పిస్తే చాలు.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…