Movie News

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. ప్రత్యూషతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన సిద్దార్థరెడ్డికి హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ, అతణ్ని వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

విదేశాల్లో ఉన్న సిద్దార్థ రెడ్డి ఇంకొన్ని రోజుల్లోనే లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. తన కూతురి మరణం విషయంలో 24 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రత్యూష తల్లి సరోజినీ దేవి.. తాజాగా ఈ తీర్పుపై స్పందించారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాను అని చెబుతూనే.. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, ఈ తీర్పుతో ప్రత్యూష ఆత్మ శాంతించదని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడేంత పిరికిది కాదని, ఆమె ఎంతో ధైర్యవంతురాలని.. తనను అలాగే పెంచానని మొదటినుంచి చెబుతున్న మాటలనే ఆమె మరోసారి స్పష్టం చేశారు.

చనిపోవడానికి ముందు ప్రత్యూషపై లైంగిక దాడి జరిగిందని, ఆమె గొంతు నొక్కి బలవంతంగా పురుగుల మందు తాగించారని.. ఈ ఆరోపణలకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని సరోజినీ దేవి స్పష్టం చేశారు.

ప్రత్యూష మరణానంతం గాంధీ ఆసుపత్రిలో మునిస్వామి అనే వైద్యుడు పోస్టుమార్టం నిర్వహించారని.. నేరుగా బాడీని చూసి ఆయన ఇచ్చిన నివేదికను ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోలేదని.. ప్రత్యూష మరణించిన నెల తర్వాత ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ కేసులో తీర్పు వచ్చిందని.. మునిస్వామి ఇచ్చిన నివేదిక కాకుండా, ప్రత్యూష బాడీని నేరుగా చూడని కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం ఎలా సమంజసమని ఆమె ప్రశ్నించారు.

సిద్దార్థ రెడ్డికి జీవిత ఖైదు పడాలని తాను 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని.. కనీసం ముందు విధించిన ఐదేళ్ల జైలు శిక్ష అయినా ఖరారవుతుందని అనుకున్నానని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తనకు ఆవేదనకు గురి చేస్తోందని.. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తానని ఆమె అన్నారు. తదుపరి ఏం చేయాలన్నది తనకు తెలియదని.. జడ్జిమెంట్ కాపీ వచ్చాక, తమ అడ్వకేట్‌తో మాట్లాడి ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటామని సరోజినీ దేవి పేర్కొన్నారు.

Kumar

Recent Posts

ఆరుగురు పతివ్రతలకు అంత సీన్ ఉందా

రీ రిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్…

4 hours ago

యూత్, మాస్ చాలు… ఇంకెవ‌రూ వ‌ద్దు

మాది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌.. పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ చూడొచ్చు.. మాది కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా…

6 hours ago

ట్రోల్ అవ్వడం జగన్ స్పెషాలిటీ

సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు…

7 hours ago

మణిరత్నం మార్కుతో మీడియం సినిమా

పరిచయమే అక్కర్లేని పేరు మణిరత్నం. దక్షిణాదిలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ సీనియర్ లెజెండ్ చాలా కాలంగా ఆయన…

7 hours ago

సోషల్ మీడియాపై పవన్ కన్ను పడింది

ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి…

8 hours ago

చరణ్ నిజంగా నిర్ణయం తీసుకున్నారా

పెద్ది థియేటర్ రన్ దాదాపుగా ముగిసింది. నెలల రోజులు పూర్తి కావడంతో చాలా సెంటర్లలో నామ మాత్రపు వసూళ్లు వస్తున్నాయి.…

9 hours ago