వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావించాడు. అయితే వకీల్సాబ్ షూట్ చివరి దశకు చేరుకున్నా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి స్క్రిప్ట్, కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక కొలిక్కి రాలేదట. అన్ని పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈలోగా సమయం వృధా కాకుండా పవన్ మళ్లీ క్రిష్ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకోమని కబురు పంపించాడట.
క్రిష్ సినిమా ఏప్రిల్లో కానీ మళ్లీ మొదలవదని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడో షెడ్యూల్ అయితే పవన్ చేస్తాడని, ఆ తర్వాత కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్ ఇచ్చి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పని పూర్తి చేసుకుని రావాలా అనేది డిసైడ్ అవుతాడని అంటున్నారు. ఇదిలావుంటే ఆ మలయాళ రీమేక్ కథకు త్రివిక్రమ్ మెరుగులు దిద్దుతున్నాడట.
మాటలు రాయడమే కాకుండా పవన్ ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు కూడా చేస్తున్నాడని, అయితే పవన్ కాకుండా మరో హీరో ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్ వినిపిస్తోంది. వకీల్సాబ్ సంక్రాంతికి రిలీజ్ అయితే ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ అనుకున్నారు. అదే ఇప్పుడు ఏప్రిల్కి వెళ్లడంతో ఈ చిత్రం ఆగస్ట్కి వాయిదా పడవచ్చు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…