Movie News

పవన్‍ అటెళ్లిపోతున్నాడు

వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్‍ పూర్తి చేయాలని పవన్‍ కళ్యాణ్‍ భావించాడు. అయితే వకీల్‍సాబ్‍ షూట్‍ చివరి దశకు చేరుకున్నా ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రానికి స్క్రిప్ట్, కాస్టింగ్‍, ప్రీ ప్రొడక్షన్‍ వర్క్ ఒక కొలిక్కి రాలేదట. అన్ని పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈలోగా సమయం వృధా కాకుండా పవన్‍ మళ్లీ క్రిష్‍ చిత్రం షూటింగ్‍ మొదలు పెట్టుకోమని కబురు పంపించాడట.

క్రిష్‍ సినిమా ఏప్రిల్‍లో కానీ మళ్లీ మొదలవదని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడో షెడ్యూల్‍ అయితే పవన్‍ చేస్తాడని, ఆ తర్వాత కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్‍ ఇచ్చి అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍ రీమేక్‍ పని పూర్తి చేసుకుని రావాలా అనేది డిసైడ్‍ అవుతాడని అంటున్నారు. ఇదిలావుంటే ఆ మలయాళ రీమేక్‍ కథకు త్రివిక్రమ్‍ మెరుగులు దిద్దుతున్నాడట.

మాటలు రాయడమే కాకుండా పవన్‍ ఇమేజ్‍కి తగ్గట్టుగా మార్పులు కూడా చేస్తున్నాడని, అయితే పవన్‍ కాకుండా మరో హీరో ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్‍ వినిపిస్తోంది. వకీల్‍సాబ్‍ సంక్రాంతికి రిలీజ్‍ అయితే ఈ చిత్రాన్ని సమ్మర్‍ రిలీజ్‍ అనుకున్నారు. అదే ఇప్పుడు ఏప్రిల్‍కి వెళ్లడంతో ఈ చిత్రం ఆగస్ట్కి వాయిదా పడవచ్చు.

This post was last modified on December 20, 2020 12:27 am

Share

Recent Posts

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

35 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

50 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 hour ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

3 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

4 hours ago