గుణశేఖర్ యుఫోరియా రెండో వారంలో అడుగు పెట్టకముందే బాగా స్లో అయిపోయింది. ప్రమోషన్ల పరంగా దర్శకుడు తన వంతుగా ఎంత కష్టపడినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ కావడంలో కంటెంట్ సక్సెస్ కాలేకపోయింది. ఒక సీరియస్ ఇష్యూని పచ్చిగా, నిజాలు అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం కమర్షియల్ గా వర్కౌట్ కావడం లేదు.
కొందరు విమర్శకులకు నచ్చింది. మరికొందరు సోషల్ యాక్టివిస్టులు మెచ్చుకున్నారు. కానీ అవి బాక్సాఫీస్ వసూళ్లకు ఉపయోగపడటం లేదు. పోటీ పెద్దగా లేకపోయినప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో యుఫోరియా తడబడుతోంది. కంటెంట్ గురించి గుణశేఖర్ తాజాగా స్పందించారు.
భయపెట్టేలా సినిమా తీశారని, కొన్నిచోట్ల ఒక హారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని కొందరు తనకు చెప్పారని గుణశేఖర్ వివరించారు. ఇలాంటి సామజిక సమస్యని ఇంత తీవ్రతతో చెబితే తప్ప కనెక్ట్ కాదని, అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇది గుర్తించినా ఆడియన్స్ కి తాను చెప్పాలనుకున్నది ఈ డెప్త్ తో అయితేనే సాధ్యమవుతుందని భావించి సాహసం చేశానని అన్నారు.
నిజమే. కానీ ఫిలిం మేకర్ గా ఆయన ఏదైతే పాజిటివ్ కోణంలో ఆలోచించారో తెరమీదకు వచ్చాక అదే నెగటివ్ గా మారిపోయిన వైనం స్పష్టం. రేప్ రీ కన్స్ ట్రక్షన్ లాంటివి చూపించిన విధానం జనాలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.
తల్లి మీద కొడుకు జుగుప్సాకర చర్యకు ట్రై చేయడం, జైళ్లలో ఉండే దారుణమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చూపించడం, భయపెట్టడంతో పాటు వేరొకరికి రికమండ్ చేయడానికి ఆలోచించేలా చేశాయి.
యుఫోరియా లాంటివి వెబ్ సిరీస్, ఓటిటి మూవీస్ గా వస్తే ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవి వాటిలో సర్వసాధారణం కాబట్టి. కానీ టికెట్లు అమ్మడం ద్వారా బిజినెస్ చేసే సినిమాకు ఇవి అంతగా సూట్ కావు. పైగా బాలీవుడ్ కల్చర్ ఇక్కడ లేదు. ఒకవేళ స్ట్రెయిట్ గా హిందీలో తీసి ఓటిటికి ఇచ్చి ఉంటే రిజల్ట్ మారేదేమో. ఏదైతేనేం యూఫోరియా రూపంలో గుణశేఖర్ లోని మేకర్ కనిపించాడు కానీ కమర్షియల్ డైరెక్టర్ ఇంకా బయటికి రాలేదు.
This post was last modified on February 12, 2026 1:51 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…