గుణశేఖర్ యుఫోరియా రెండో వారంలో అడుగు పెట్టకముందే బాగా స్లో అయిపోయింది. ప్రమోషన్ల పరంగా దర్శకుడు తన వంతుగా ఎంత కష్టపడినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ కావడంలో కంటెంట్ సక్సెస్ కాలేకపోయింది. ఒక సీరియస్ ఇష్యూని పచ్చిగా, నిజాలు అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం కమర్షియల్ గా వర్కౌట్ కావడం లేదు.
కొందరు విమర్శకులకు నచ్చింది. మరికొందరు సోషల్ యాక్టివిస్టులు మెచ్చుకున్నారు. కానీ అవి బాక్సాఫీస్ వసూళ్లకు ఉపయోగపడటం లేదు. పోటీ పెద్దగా లేకపోయినప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో యుఫోరియా తడబడుతోంది. కంటెంట్ గురించి గుణశేఖర్ తాజాగా స్పందించారు.
భయపెట్టేలా సినిమా తీశారని, కొన్నిచోట్ల ఒక హారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని కొందరు తనకు చెప్పారని గుణశేఖర్ వివరించారు. ఇలాంటి సామజిక సమస్యని ఇంత తీవ్రతతో చెబితే తప్ప కనెక్ట్ కాదని, అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇది గుర్తించినా ఆడియన్స్ కి తాను చెప్పాలనుకున్నది ఈ డెప్త్ తో అయితేనే సాధ్యమవుతుందని భావించి సాహసం చేశానని అన్నారు.
నిజమే. కానీ ఫిలిం మేకర్ గా ఆయన ఏదైతే పాజిటివ్ కోణంలో ఆలోచించారో తెరమీదకు వచ్చాక అదే నెగటివ్ గా మారిపోయిన వైనం స్పష్టం. రేప్ రీ కన్స్ ట్రక్షన్ లాంటివి చూపించిన విధానం జనాలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.
తల్లి మీద కొడుకు జుగుప్సాకర చర్యకు ట్రై చేయడం, జైళ్లలో ఉండే దారుణమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు చూపించడం, భయపెట్టడంతో పాటు వేరొకరికి రికమండ్ చేయడానికి ఆలోచించేలా చేశాయి.
యుఫోరియా లాంటివి వెబ్ సిరీస్, ఓటిటి మూవీస్ గా వస్తే ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవి వాటిలో సర్వసాధారణం కాబట్టి. కానీ టికెట్లు అమ్మడం ద్వారా బిజినెస్ చేసే సినిమాకు ఇవి అంతగా సూట్ కావు. పైగా బాలీవుడ్ కల్చర్ ఇక్కడ లేదు. ఒకవేళ స్ట్రెయిట్ గా హిందీలో తీసి ఓటిటికి ఇచ్చి ఉంటే రిజల్ట్ మారేదేమో. ఏదైతేనేం యూఫోరియా రూపంలో గుణశేఖర్ లోని మేకర్ కనిపించాడు కానీ కమర్షియల్ డైరెక్టర్ ఇంకా బయటికి రాలేదు.
This post was last modified on February 12, 2026 1:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…