డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలామంది సినీ జనాలు చెబుతుంటారు. ఐతే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వాళ్లు మాత్రం అరుదుగానే ఉంటారు. కన్నడనాట స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రీలీల ఈ కోవకే చెందుతుంది. టీనేజీలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టేసిన ఆమె.. కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగినా చదువును మాత్రం విడిచిపెట్టలేదు.
అలా అని మొక్కుబడిగా ఏదో ఒక డిగ్రీ కోసం ట్రై చేయకుండా అత్యంత కష్టమైన ఎంబీబీఎస్లో చేరింది. తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే చదువును కొనసాగించింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం కొన్ని నెలల కిందటే వెల్లడైంది. ఇప్పుడు శ్రీలీల.. అధికారికంగా డిగ్రీ తీసుకుంది. శ్రీలీల తాను చదివిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది.
బహు భాషల్లో కథానాయికగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తూ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేయడం ద్వారా శ్రీలీల యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అధికారికంగా పట్టా పుచ్చుకుంది కాబట్టి.. ఇకపై సినిమాల్లో తన పేరును ‘డాక్టర్ శ్రీలీల’ అని వేయాలి. కన్నడ సినిమాలతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల.. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే తెలుగులో ఆమె పది సినిమాలకు పైగా చేసింది.
ఇటీవలే శివ కార్తికేయన్ చిత్రం ‘పరాశక్తి’తో తమిళంలోకి అడుగు పెట్టింది శ్రీలీల. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో మళ్లీ ఓ పెద్ద సక్సెస్ కోసం చూస్తున్న ఆమె.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…