దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు లేరు. కొన్నేళ్ల ముందు ‘యురి’ చిత్రంతో ఆదిత్య ధర్ ఎలా బాక్సాఫీస్ను షేక్ చేశాడో తెలిసిందే. అదే దర్శకుడు ‘దురంధర్’తో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ నుంచి ఇలాంటి సినిమాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి.
పాకిస్థాన్, గల్ఫ్ కంట్రీస్లో సల్మాన్కు భారీ మార్కెట్ ఉన్న దృష్ట్యా అతను పాకిస్థాన్ను పూర్తి స్థాయి శత్రువుగా చూపించే సినిమాలు చేయడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ట్రెండును ఫాలో అవ్వకపోతే కష్టం. తనకు సక్సెస్ చాలా అవసరం. అందుకే చైనాను విలన్గా చూపించే సినిమాను టేకప్ చేశాడు. అదే.. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్.
2020లో భారత్, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగింది. అందులో భారత్దే పైచేయి అయింది. దీని నేపథ్యంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాను మొదలుపెట్టాడు సల్మాన్. ఐతే కొన్ని నెలల ముందు రిలీజైన టీజర్ తుస్సుమనిపించింది. ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి రేకెత్తించలేదు. టీజర్ చూస్తే అతిశయోక్తులతో సినిమాను నింపేసినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో నెగెటివిటీ తప్పలేదు.
ఇండియాకు బద్ధ శత్రువైన పాకిస్థాన్ మీద సినిమాలు తీయడు, పహల్గాం ఉగ్రదాడిని ఖండించడు కానీ.. సక్సెస్ కోసం చైనా మీద సినిమా చేశాడంటూ సల్మాన్ మీద కౌంటర్లు కూడా పడ్డాయి. మొత్తంగా సినిమా మీద నెగెటివిటీ ముసురుకుంది. దీంతో సల్మాన్ అండ్ టీం పునరాలోచనలో పడింది.
ఏప్రిల్లో అనుకున్న రిలీజ్ డేట్ ను మారుస్తున్నారట. జూన్ లేదా జులైకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సినిమాకు రీషూట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపుల నుంచి సల్మాన్కు ఉపశమనాన్ని ఇస్తుందనుకున్న సినిమా కాస్తా.. అతడికి మరో గుదిబండగా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…