దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు లేరు. కొన్నేళ్ల ముందు ‘యురి’ చిత్రంతో ఆదిత్య ధర్ ఎలా బాక్సాఫీస్ను షేక్ చేశాడో తెలిసిందే. అదే దర్శకుడు ‘దురంధర్’తో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ నుంచి ఇలాంటి సినిమాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి.
పాకిస్థాన్, గల్ఫ్ కంట్రీస్లో సల్మాన్కు భారీ మార్కెట్ ఉన్న దృష్ట్యా అతను పాకిస్థాన్ను పూర్తి స్థాయి శత్రువుగా చూపించే సినిమాలు చేయడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ట్రెండును ఫాలో అవ్వకపోతే కష్టం. తనకు సక్సెస్ చాలా అవసరం. అందుకే చైనాను విలన్గా చూపించే సినిమాను టేకప్ చేశాడు. అదే.. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్.
2020లో భారత్, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగింది. అందులో భారత్దే పైచేయి అయింది. దీని నేపథ్యంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాను మొదలుపెట్టాడు సల్మాన్. ఐతే కొన్ని నెలల ముందు రిలీజైన టీజర్ తుస్సుమనిపించింది. ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి రేకెత్తించలేదు. టీజర్ చూస్తే అతిశయోక్తులతో సినిమాను నింపేసినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో నెగెటివిటీ తప్పలేదు.
ఇండియాకు బద్ధ శత్రువైన పాకిస్థాన్ మీద సినిమాలు తీయడు, పహల్గాం ఉగ్రదాడిని ఖండించడు కానీ.. సక్సెస్ కోసం చైనా మీద సినిమా చేశాడంటూ సల్మాన్ మీద కౌంటర్లు కూడా పడ్డాయి. మొత్తంగా సినిమా మీద నెగెటివిటీ ముసురుకుంది. దీంతో సల్మాన్ అండ్ టీం పునరాలోచనలో పడింది.
ఏప్రిల్లో అనుకున్న రిలీజ్ డేట్ ను మారుస్తున్నారట. జూన్ లేదా జులైకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సినిమాకు రీషూట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపుల నుంచి సల్మాన్కు ఉపశమనాన్ని ఇస్తుందనుకున్న సినిమా కాస్తా.. అతడికి మరో గుదిబండగా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on February 9, 2026 3:13 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…