టాలీవుడ్ పెద్ద సినిమాలకే బాలీవుడ్ మార్కెట్లో సరైన రిలీజ్ దొరకడం ఈ మధ్య కాలంలో ఒక పెద్ద టాస్క్గా మారింది. చాలా వరకు మన టైర్ 2 హీరోలు అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నా, ఆశించిన స్థాయిలో థియేటర్లు లేదా ప్రమోషన్లు దొరకక వెనకబడిపోతున్నారు. కానీ నాని తన రాబోయే సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్తో ఉన్నట్లు కనిపిస్తోంది. అతి పెద్ద రేంజ్లో ఈ సినిమాను హిందీ బెల్ట్లో దించాలని మేకర్స్ స్కెచ్ వేశారు.
సాధారణంగా సౌత్ సినిమాలు హిందీలో రిలీజ్ అవ్వాలంటే అందరూ గోల్డ్ మైన్స్, పెన్ స్టూడియోస్, ఏ ఏ లాంటి సంస్థల వైపు చూస్తుంటారు. కానీ నాని టీమ్ మాత్రం ఈసారి రూట్ మార్చి జియో స్టూడియోస్ను లైన్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఇటీవలే రణ్వీర్ సింగ్ ‘ధూరందర్’ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసి, 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ట్రాక్ రికార్డ్ జియో స్టూడియోస్కు ఉంది. అలాంటి బడా సంస్థ నాని సినిమాను టేకోవర్ చేయడం హిందీ మార్కెట్లో ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ వారంలోనే హిందీ రిలీజ్ డీల్కు సంబంధించి క్లోజింగ్ పనులు పూర్తి కాబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో ‘దసరా’తో బిగ్ హిట్ కొట్టిన నాని, ఈసారి మాత్రం కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా గట్టి ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నారు. జియో స్టూడియోస్ గనుక రంగంలోకి దిగితే థియేటర్ల కౌంట్ ప్రమోషన్ల విషయంలో సినిమాకు ఒక రేంజ్ హైప్ దొరుకుతుంది.
నిజానికి బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు వైవిధ్యమైన సౌత్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరైన సమయంలో, బలమైన సంస్థ ద్వారా సినిమాను ప్రమోట్ చేస్తే నాని రేంజ్ అక్కడ కూడా పెరగడం ఖాయం.
‘ది ప్యారడైజ్’ సక్సెస్ అయితే, టాలీవుడ్ మిగతా హీరోలకు కూడా ఇది ఒక కొత్త దారి చూపిస్తుంది. జియో స్టూడియోస్ పట్టుకున్న డీల్ పై త్వరలోనే అఫీషియల్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఇంత పెద్ద స్టెప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ భారీ రిలీజ్ ప్లాన్ నానికి బాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
This post was last modified on February 9, 2026 3:05 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…