మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి ప్రశంసలు అందుకుంటే ఆ నటుడికి అదొక గౌరవం. ఈ తరంలో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరు చెప్పినట్లుగా ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు బాబీ చెబితే.. నవీన్ ఎంతగా పొంగిపోయాడో.
అలాగే తనకు సంబంధం లేని సినిమాలో ఫలానా నటుడు ఈ పాత్రలో బాగుంటాడు, అతణ్ని తీసుకో అని ఒక దర్శకుడికి చిరు చెప్పాడంటే ఆ నటుడిపై ఆయనకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఒక పాత్రకు విజయ్ సేతుపతి పేరును సూచించాడట మెగాస్టార్.
తెలుగు వారికీ సుపరిచితుడైన తమిళ సీనియర్ నటుడు అర్జున్.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో అర్జున్ తనయురాలు ఐశ్వర్య లీడ్ రోల్ చేసింది. ఆమెకు జోడీగా నిరంజన్ అనే కొత్త కుర్రాడు నటించాడు.
ఇందులో రౌడీగా ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో అర్జునే నటించాడు. కానీ ఆ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోమని చిరు చెప్పాడట. ‘సీతాపయనం’ కథ చిరుకు బాగా తెలుసని.. ఆయనకు ఇది ఎంతో నచ్చిందని.. ఇందులో కీలక పాత్రకు సేతుపతి బాగుంటాడని చిరు అభిప్రాయపడ్డాడని.. కానీ డేట్ల సమస్య వల్ల అతనీ చిత్రంలో నటించకపోవడంతో చివరికి తానే ఆ పాత్ర చేశానని అర్జున్ వెల్లడించాడు.
నటుడిగా తన కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసినప్పటికీ.. దర్శకుడిగా తన అభిరుచి ‘సీతాపయనం’ లాంటి క్లాస్ సినిమాలే అని అర్జున్ తెలిపాడు. సమాజానికి మంచి విషయాలు చెప్పాలనే తపన తనలో ఉందని.. ఈ క్రమంలోనే ‘సీతాపయనం’ చేశానని.. ఇది హృద్యంగా సాగే చిత్రమని అతనన్నాడు.
‘సీతాపయనం’లో అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశాడు. ఇందులో ఐశ్వర్యకు జోడీగా ముందు విశ్వక్సేన్ను ఎంచుకున్నాడు అర్జున్. కానీ షూట్ మొదలయ్యే ముందు అతనీ చిత్రం నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. దీని మీద అర్జున్ చాలా హర్టయి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రెండేళ్ల ముందు.
This post was last modified on February 8, 2026 12:45 pm
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…