మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి ప్రశంసలు అందుకుంటే ఆ నటుడికి అదొక గౌరవం. ఈ తరంలో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరు చెప్పినట్లుగా ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు బాబీ చెబితే.. నవీన్ ఎంతగా పొంగిపోయాడో.
అలాగే తనకు సంబంధం లేని సినిమాలో ఫలానా నటుడు ఈ పాత్రలో బాగుంటాడు, అతణ్ని తీసుకో అని ఒక దర్శకుడికి చిరు చెప్పాడంటే ఆ నటుడిపై ఆయనకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఒక పాత్రకు విజయ్ సేతుపతి పేరును సూచించాడట మెగాస్టార్.
తెలుగు వారికీ సుపరిచితుడైన తమిళ సీనియర్ నటుడు అర్జున్.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో అర్జున్ తనయురాలు ఐశ్వర్య లీడ్ రోల్ చేసింది. ఆమెకు జోడీగా నిరంజన్ అనే కొత్త కుర్రాడు నటించాడు.
ఇందులో రౌడీగా ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో అర్జునే నటించాడు. కానీ ఆ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోమని చిరు చెప్పాడట. ‘సీతాపయనం’ కథ చిరుకు బాగా తెలుసని.. ఆయనకు ఇది ఎంతో నచ్చిందని.. ఇందులో కీలక పాత్రకు సేతుపతి బాగుంటాడని చిరు అభిప్రాయపడ్డాడని.. కానీ డేట్ల సమస్య వల్ల అతనీ చిత్రంలో నటించకపోవడంతో చివరికి తానే ఆ పాత్ర చేశానని అర్జున్ వెల్లడించాడు.
నటుడిగా తన కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసినప్పటికీ.. దర్శకుడిగా తన అభిరుచి ‘సీతాపయనం’ లాంటి క్లాస్ సినిమాలే అని అర్జున్ తెలిపాడు. సమాజానికి మంచి విషయాలు చెప్పాలనే తపన తనలో ఉందని.. ఈ క్రమంలోనే ‘సీతాపయనం’ చేశానని.. ఇది హృద్యంగా సాగే చిత్రమని అతనన్నాడు.
‘సీతాపయనం’లో అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశాడు. ఇందులో ఐశ్వర్యకు జోడీగా ముందు విశ్వక్సేన్ను ఎంచుకున్నాడు అర్జున్. కానీ షూట్ మొదలయ్యే ముందు అతనీ చిత్రం నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. దీని మీద అర్జున్ చాలా హర్టయి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రెండేళ్ల ముందు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…