మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి ప్రశంసలు అందుకుంటే ఆ నటుడికి అదొక గౌరవం. ఈ తరంలో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరు చెప్పినట్లుగా ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు బాబీ చెబితే.. నవీన్ ఎంతగా పొంగిపోయాడో.
అలాగే తనకు సంబంధం లేని సినిమాలో ఫలానా నటుడు ఈ పాత్రలో బాగుంటాడు, అతణ్ని తీసుకో అని ఒక దర్శకుడికి చిరు చెప్పాడంటే ఆ నటుడిపై ఆయనకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఒక పాత్రకు విజయ్ సేతుపతి పేరును సూచించాడట మెగాస్టార్.
తెలుగు వారికీ సుపరిచితుడైన తమిళ సీనియర్ నటుడు అర్జున్.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో అర్జున్ తనయురాలు ఐశ్వర్య లీడ్ రోల్ చేసింది. ఆమెకు జోడీగా నిరంజన్ అనే కొత్త కుర్రాడు నటించాడు.
ఇందులో రౌడీగా ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో అర్జునే నటించాడు. కానీ ఆ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోమని చిరు చెప్పాడట. ‘సీతాపయనం’ కథ చిరుకు బాగా తెలుసని.. ఆయనకు ఇది ఎంతో నచ్చిందని.. ఇందులో కీలక పాత్రకు సేతుపతి బాగుంటాడని చిరు అభిప్రాయపడ్డాడని.. కానీ డేట్ల సమస్య వల్ల అతనీ చిత్రంలో నటించకపోవడంతో చివరికి తానే ఆ పాత్ర చేశానని అర్జున్ వెల్లడించాడు.
నటుడిగా తన కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసినప్పటికీ.. దర్శకుడిగా తన అభిరుచి ‘సీతాపయనం’ లాంటి క్లాస్ సినిమాలే అని అర్జున్ తెలిపాడు. సమాజానికి మంచి విషయాలు చెప్పాలనే తపన తనలో ఉందని.. ఈ క్రమంలోనే ‘సీతాపయనం’ చేశానని.. ఇది హృద్యంగా సాగే చిత్రమని అతనన్నాడు.
‘సీతాపయనం’లో అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశాడు. ఇందులో ఐశ్వర్యకు జోడీగా ముందు విశ్వక్సేన్ను ఎంచుకున్నాడు అర్జున్. కానీ షూట్ మొదలయ్యే ముందు అతనీ చిత్రం నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. దీని మీద అర్జున్ చాలా హర్టయి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రెండేళ్ల ముందు.
This post was last modified on February 8, 2026 12:45 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…