అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక రాశి ఖన్నా. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లోనూ స్కోర్ చేసింది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో ఒకేసారి పెద్ద సినిమాల్లో అవకాశం రాలేదు. ఇప్పటికీ టైర్-2 హీరోయిన్గానే కొనసాగుతోంది.
మధ్యలో ‘జై లవకుశ’ లాంటి ఓ పెద్ద సినిమాలో నటించింది కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అందులో ఆమె ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది.
ఆపై ‘తొలి ప్రేమ’ సినిమాతో తన టాలెంటంతా బయటపెట్టినా కూడా రాశి కోరుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోపు తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి. ఇప్పుడు ఆమెకు కెరీర్లో అతి పెద్ద అవకాశం వచ్చినట్లే కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన రాశి నటించబోతోంది. హరి దర్శకత్వంలో సూర్య చేయబోయే కొత్త సినిమాలో రాశినే కథానాయిక. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా అభిమానులతో చేసిన ట్విట్టర్ చిట్ చాట్లో ఆమె వెల్లడించింది.
దీంతో పాటు సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ కూడా చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఐతే తెలుగులో మాత్రం రాశి ఏ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ఖరారు చేయలేదు. చర్చలు జరుగుతున్నాయని.. లౌక్ డౌన్ తర్వాత టాలీవుడ్ కొత్త సినిమాల గురించి వెల్లడిస్తానని చెప్పింది.
ఇక ఈ చిట్చాట్లో మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే.. ‘ది ప్రపోజల్’ అని చెప్పిన రాశి.. తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే.. ‘నా ప్రాణం’ అని బదులిచ్చింది.
తమిళంలో తన ఫేవరెట్ హీరో విజయ్ అని చెప్పిన రాశి.. అక్కడి దర్శకుల్లో వెట్రిమారన్, శంకర్, మణిరత్నంలను ఎక్కువగా అభిమానిస్తానని అంది. అల్లు అర్జున్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. తన చుట్టూ ఉన్న వాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తాడని.. ఆయనతో నటించాలని ఉందని చెప్పింది రాశి.
This post was last modified on May 3, 2020 10:46 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…