అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక రాశి ఖన్నా. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లోనూ స్కోర్ చేసింది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో ఒకేసారి పెద్ద సినిమాల్లో అవకాశం రాలేదు. ఇప్పటికీ టైర్-2 హీరోయిన్గానే కొనసాగుతోంది.
మధ్యలో ‘జై లవకుశ’ లాంటి ఓ పెద్ద సినిమాలో నటించింది కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అందులో ఆమె ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది.
ఆపై ‘తొలి ప్రేమ’ సినిమాతో తన టాలెంటంతా బయటపెట్టినా కూడా రాశి కోరుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోపు తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి. ఇప్పుడు ఆమెకు కెరీర్లో అతి పెద్ద అవకాశం వచ్చినట్లే కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన రాశి నటించబోతోంది. హరి దర్శకత్వంలో సూర్య చేయబోయే కొత్త సినిమాలో రాశినే కథానాయిక. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా అభిమానులతో చేసిన ట్విట్టర్ చిట్ చాట్లో ఆమె వెల్లడించింది.
దీంతో పాటు సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ కూడా చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఐతే తెలుగులో మాత్రం రాశి ఏ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ఖరారు చేయలేదు. చర్చలు జరుగుతున్నాయని.. లౌక్ డౌన్ తర్వాత టాలీవుడ్ కొత్త సినిమాల గురించి వెల్లడిస్తానని చెప్పింది.
ఇక ఈ చిట్చాట్లో మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే.. ‘ది ప్రపోజల్’ అని చెప్పిన రాశి.. తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే.. ‘నా ప్రాణం’ అని బదులిచ్చింది.
తమిళంలో తన ఫేవరెట్ హీరో విజయ్ అని చెప్పిన రాశి.. అక్కడి దర్శకుల్లో వెట్రిమారన్, శంకర్, మణిరత్నంలను ఎక్కువగా అభిమానిస్తానని అంది. అల్లు అర్జున్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. తన చుట్టూ ఉన్న వాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తాడని.. ఆయనతో నటించాలని ఉందని చెప్పింది రాశి.
This post was last modified on May 3, 2020 10:46 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…