ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. యశ్ లాంటి మీడియం రేంజ్ హీరోను పెట్టి ‘కేజీఎఫ్’ను మాస్కు పూనకాలు తెప్పించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనిచ్చిన హీరో ఎలివేషన్లకు వివిధ భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యశ్ అనే వాడు తమకు పరిచయం లేకపోయినా సరే.. ‘కేజీఎఫ్’లో ఒక సూపర్ స్టార్ను చూస్తున్న ఫీలింగ్ కలిగిందంటే అదంతా ప్రశాంత్ ప్రతిభే.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్తో పని చేయడానికి వివిధ ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లు ఆసక్తి చూపించారు. ఓవైపు ‘కేజీఎఫ్-2’ చేస్తూనే.. అతను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్తో ఓ సినిమాను ఓకే చేశాడు. ‘సలార్’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాను ఇటీవలే ప్రకటించారు కూడా. అలాగే జూనియర్ ఎన్టీఆర్తోనూ సినిమా చేయడానికి ప్రశాంత్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నదానిపై స్పష్టత లేదు.
ఈలోపు ప్రశాంత్ మరో సినిమాను ఓకే చేశాడు. కాకపోతే ఆ సినిమాకు ప్రశాంత్ స్క్రిప్టు మాత్రమే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించాడు. ‘కేజీఎఫ్’తో పాటు ‘సలార్’ను నిర్మిస్తున్న హోంబలె ఫిలిమ్స్తోనే ఈ సినిమా కూడా చేయబోతున్నాడు ప్రశాంత్. ఈ చిత్రానికి ‘భగీర’ అనే మాస్ టైటిల్ ఖరారు చేశారు.
ఇందులో శ్రీ మురళి కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ యువ నటుడితోనే ప్రశాంత్ దర్శకుడిగా తన తొలి చిత్రం చేశాడు. ‘ఉగ్రం’ పేరుతో తెరకెక్కిన ఆ గ్యాంగ్స్టర్ డ్రామా సూపర్ హిట్టయింది. తర్వాత ‘కేజీఎఫ్’తో ప్రశాంత్ రేంజే మారిపోయింది. ఇప్పుడు శ్రీ మురళి హీరోగా హోంబలె ఫిలిమ్స్లో వరుసగా తన నాలుగో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ప్రశాంత్.ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరో పోలీస్. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ డిజైన్ చేసి When socitey becomes jungle.. and only one predator roars for justice అంటూ క్యాప్షన్ జోడించడంతో ఇందులోనూ ప్రశాంత్ మార్కు హీరో ఎలివేషన్లు, మాస్ సన్నివేశాలకు లోటుండదని భావిస్తున్నారు.
This post was last modified on December 17, 2020 2:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…