Movie News

‘దంగల్’ రికార్డుకు మూడినట్లేనా?

పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు మీదే ఉంది. నిజానికి మొదట రిలీజైనపుడు ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు రూ.800 కోట్లే. 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూ.1800 కోట్ల వసూళ్లతో ‘దంగల్’ను దాటేసింది.

అయితే ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత చైనాలో రిలీజైన ‘దంగల్’ అక్కడ అనూహ్యంగా భారీ వసూళ్లు రాబట్టడంతో ఓవరాల్ వసూళ్ల లెక్క మారిపోయింది. ఓవరాల్‌గా ఆ చిత్రం రూ.2000 కోట్లతో రికార్డును సొంతం చేసుకుంది.
తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, కల్కి లాంటి భారీ చిత్రాలు వచ్చినా ఆ రికార్డును దాటలేకపోయాయి. ఐతే ఈ ఏడాది ‘దంగల్’ రికార్డు బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కొత్త రికార్డును ‘దురంధర్-2’ తన ఖాతాలో వేసుకుంటే ఆశ్చర్యం లేదు. డిసెంబరులో విడుదలైనపుడు ‘దురంధర్’పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఎంత పెద్ద సినిమా అయినా మూణ్నాలుగు వారాలకు మించి ఆడని రోజుల్లో ఆ చిత్రం రెండు నెలల పాటు నిలకడగా వసూళ్లు రాబట్టింది.

ఇంకా ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతున్న సమయంలోనే ‘దురంధర్’ ఓటీటీలో రిలీజైంది. ఇక్కడ రెస్పాన్స్ ఇంకో స్థాయిలో ఉంది. ప్రాంతీయ భాషల వాళ్లూ ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సినిమాకు హైప్ ఇంకా పెరిగింది. డిజిటల్ వెర్షన్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే.. ‘దురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ఓపెనింగ్స్‌కు ఆకాశమే హద్దు. పెద్దగా హైప్ లేకుండానే ‘దురంధర్’ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
మరి భారీ అంచనాలతో మార్చి 19న రాబోతున్న ‘దురంధర్-2’కు కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? మరీ బ్యాడ్‌గా లేదు అనే టాక్ వచ్చినా ఈ సినిమా వసూళ్ల ఊచకోతతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.

తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు వేరే స్థాయిలో ఉండడం ఖాయం. అన్నీ కలిసొస్తే ‘దంగల్’ రికార్డును బద్దలు కొట్టి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలవడం ఖాయం.

This post was last modified on February 3, 2026 11:40 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

1 hour ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago