పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు మీదే ఉంది. నిజానికి మొదట రిలీజైనపుడు ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు రూ.800 కోట్లే. 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూ.1800 కోట్ల వసూళ్లతో ‘దంగల్’ను దాటేసింది.
అయితే ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత చైనాలో రిలీజైన ‘దంగల్’ అక్కడ అనూహ్యంగా భారీ వసూళ్లు రాబట్టడంతో ఓవరాల్ వసూళ్ల లెక్క మారిపోయింది. ఓవరాల్గా ఆ చిత్రం రూ.2000 కోట్లతో రికార్డును సొంతం చేసుకుంది.
తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, కల్కి లాంటి భారీ చిత్రాలు వచ్చినా ఆ రికార్డును దాటలేకపోయాయి. ఐతే ఈ ఏడాది ‘దంగల్’ రికార్డు బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కొత్త రికార్డును ‘దురంధర్-2’ తన ఖాతాలో వేసుకుంటే ఆశ్చర్యం లేదు. డిసెంబరులో విడుదలైనపుడు ‘దురంధర్’పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఎంత పెద్ద సినిమా అయినా మూణ్నాలుగు వారాలకు మించి ఆడని రోజుల్లో ఆ చిత్రం రెండు నెలల పాటు నిలకడగా వసూళ్లు రాబట్టింది.
ఇంకా ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతున్న సమయంలోనే ‘దురంధర్’ ఓటీటీలో రిలీజైంది. ఇక్కడ రెస్పాన్స్ ఇంకో స్థాయిలో ఉంది. ప్రాంతీయ భాషల వాళ్లూ ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సినిమాకు హైప్ ఇంకా పెరిగింది. డిజిటల్ వెర్షన్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే.. ‘దురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా ఓపెనింగ్స్కు ఆకాశమే హద్దు. పెద్దగా హైప్ లేకుండానే ‘దురంధర్’ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
మరి భారీ అంచనాలతో మార్చి 19న రాబోతున్న ‘దురంధర్-2’కు కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? మరీ బ్యాడ్గా లేదు అనే టాక్ వచ్చినా ఈ సినిమా వసూళ్ల ఊచకోతతో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం.
తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు వేరే స్థాయిలో ఉండడం ఖాయం. అన్నీ కలిసొస్తే ‘దంగల్’ రికార్డును బద్దలు కొట్టి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలవడం ఖాయం.
This post was last modified on February 3, 2026 11:40 am
ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. 'పుష్ప 2' సినిమాతో ఏకంగా…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రస్థాయి రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ…
ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు.…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన సంగతి…
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…