తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే చేశారు. మలయాళం రీమేకని ఓపెన్ గా చెప్పి ఎందుకు చూడాలో, లాజికల్ గా వివరణ ఇచ్చి మరీ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు నిర్మాత శత విధాలా ప్రయత్నించారు.
ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అన్ని జరిగాయి. తీరా చూస్తే ఓపెనింగ్స్ రాలేదు. ఇలాంటి చిన్న సినిమాలకు పబ్లిక్ టాక్ కీలకం కాబట్టి మెల్లగా ఊపందుకుంటుందేమోనన్నీ చూస్తే అదీ కనిపించలేదు. నిన్న దీని కన్నా రెండు వారాల క్రితం రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు, మిగిలిన సంక్రాంతి మూవీస్ కే ఎక్కువ బుకింగ్స్ జరగడం గమనించాల్సిన విషయం.
అలాని ఇదేదో పూర్తిగా తీసి పారేసే సినిమా కాదు కానీ సెకండాఫ్ ని హ్యాండిల్ చేయడంలో జరిగిన తడబాటు వల్ల వచ్చిన కాసిన్ని ఆడియన్స్ ని మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. భార్య భర్తల ఈగోలను ఒక సింపుల్ పాయింట్ తో తెరకెక్కించిన విధానం అన్ని వర్గాలను సంతృప్తిపర్చలేదన్నది వాస్తవం.
హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ ఒకటి గుర్తించాలి. ఆర్టిస్టుగా కన్నా తను డైరెక్టర్ గా ఎక్కువ క్యాలిబర్ కలిగి ఉన్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది దాన్ని ఋజువు చేశాయి. కీడా కోలా అద్భుతాలు చేయకపోయినా ఒక సెక్షన్ ని మెప్పించింది. ఇప్పుడు ఈనఏ 2కి ఏకంగా నలభై కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.
నటుడిగా తరుణ్ భాస్కర్ కు జనంలో ఎలాంటి ఫుల్ లేదు. తనను చూసేందుకు టికెట్లు తెంపే జనాలు బిసి సెంటర్స్ లో లేరు. అలాని హైదరాబాద్ లాంటి చోట హౌస్ ఫుల్స్ పడుతున్నాయా అంటే అదీ లేదు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీలతో జస్ట్ పర్వాలేదనిపిస్తున్నాయి అంతే.
అసలు కాంపిటీషన్ లేకుండా సోలోగా వచ్చినా కూడా ఓం శాంతి శాంతి శాంతికి ఇలాంటి రెస్పాన్స్ రావడం ట్రేడ్ వర్గాలకు షాకే. సంక్రాంతి హడావిడి తర్వాత వచ్చిన ఇంత గ్యాప్ ని వాడుకోలేకపోయిన తీరు విచారకరం. థియేట్రికల్ గా ఎలా పెర్ఫార్మ్ చేసినా డిజిటల్, శాటిలైట్ లో ఈ సినిమాకు బాగానే కిట్టుబాటు అయ్యిందని టాక్.
This post was last modified on February 2, 2026 10:33 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…