ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్లే ధూమ్, పుష్ప, కెజిఎఫ్, బాహుబలి, కాంతార లాంటివి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కొన్ని ఊసులో లేకుండా పోయాయి.
బాలీవుడ్ ఈ కంటిన్యుయేషన్ హ్యాంగోవర్ ఎప్పటి నుంచో ఉంది. 2014లో రాణి ముఖర్జీ టైటిల్ పాత్రలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన మర్దాని వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ఘనవిజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో రూపొంది అప్పట్లోనే అరవై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు.
అయిదు సంవత్సరాల తర్వాత 2019లో మర్దాని 2 వచ్చింది. సైకో కిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా కూడా బాగానే అలరించింది. కేవలం ఒక గంట నలభై అయిదు నిమిషాల నిడివితో ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇది కూడా సుమారు 68 కోట్ల దాకా వసూళ్లు తెచ్చి హైప్ నిలబెట్టుకుంది.
తాజాగా మర్దాని 3 రిలీజయ్యింది. ఏడేళ్ల గ్యాప్ కావడంతో ఈసారి బజ్ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. కానీ మేజిక్ రిపీట్ కాలేదు. మూడోసారి మర్దాని దొరికిపోయింది. లైఫ్ టైం థియేటర్ వసూళ్లు 35 కోట్లకు దాటాకపోవచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇంత తక్కువ స్పందనకు కారణాలు లేకపోలేదు.
మర్దాని 3 స్టోరీ చాలా రొటీన్ గా రాసుకున్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి మాఫియా నడిపించే అమ్మ అనే లేడీ డాన్ ఆటకట్టించడమే ఇందులో మెయిన్ పాయింట్. సన్నివేశాలు చాలా ఫ్లాట్ గా, ట్విస్టులు చప్పగా సాగుతూ ఒక మాములు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి.
మొదటి రెండు భాగాలకు బలంగా నిలిచిన బిగుతైన స్క్రీన్ ప్లే ఈసారి బలహీనంగా మారిపోయింది. రెండు గంటల లెన్త్ కూడా భారంగా అనిపిస్తుంది. రాణి ముఖర్జీ తన వంతుగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆవిడ ఒక్కటే వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయింది. మర్దాని ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేయడం మరో ప్రధానమైన మైనస్.
This post was last modified on February 2, 2026 12:12 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…