Movie News

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్లే ధూమ్, పుష్ప, కెజిఎఫ్, బాహుబలి, కాంతార లాంటివి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కొన్ని ఊసులో లేకుండా పోయాయి.

బాలీవుడ్ ఈ కంటిన్యుయేషన్ హ్యాంగోవర్ ఎప్పటి నుంచో ఉంది. 2014లో రాణి ముఖర్జీ టైటిల్ పాత్రలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన మర్దాని వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ఘనవిజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో రూపొంది అప్పట్లోనే అరవై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు.

అయిదు సంవత్సరాల తర్వాత 2019లో మర్దాని 2 వచ్చింది. సైకో కిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా కూడా బాగానే అలరించింది. కేవలం ఒక గంట నలభై అయిదు నిమిషాల నిడివితో ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇది కూడా సుమారు 68 కోట్ల దాకా వసూళ్లు తెచ్చి హైప్ నిలబెట్టుకుంది.

తాజాగా మర్దాని 3 రిలీజయ్యింది. ఏడేళ్ల గ్యాప్ కావడంతో ఈసారి బజ్ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. కానీ మేజిక్ రిపీట్ కాలేదు. మూడోసారి మర్దాని దొరికిపోయింది. లైఫ్ టైం థియేటర్ వసూళ్లు 35 కోట్లకు దాటాకపోవచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇంత తక్కువ స్పందనకు కారణాలు లేకపోలేదు.

మర్దాని 3 స్టోరీ చాలా రొటీన్ గా రాసుకున్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి మాఫియా నడిపించే అమ్మ అనే లేడీ డాన్ ఆటకట్టించడమే ఇందులో మెయిన్ పాయింట్. సన్నివేశాలు చాలా ఫ్లాట్ గా, ట్విస్టులు చప్పగా సాగుతూ ఒక మాములు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి.

మొదటి రెండు భాగాలకు బలంగా నిలిచిన బిగుతైన స్క్రీన్ ప్లే ఈసారి బలహీనంగా మారిపోయింది. రెండు గంటల లెన్త్ కూడా భారంగా అనిపిస్తుంది. రాణి ముఖర్జీ తన వంతుగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆవిడ ఒక్కటే వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయింది. మర్దాని ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేయడం మరో ప్రధానమైన మైనస్.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

28 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago