చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’దే. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం.. తన కలల సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కించడానికి రాజమౌళి ‘బాహుబలి’నే స్ఫూర్తి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కోవలోనే మరెన్నో భారీ చిత్రాలు తెరకెక్కాయి.
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా సైతం మహాభారతంలో కల్ట్ క్యారెక్టర్ అయిన కర్ణుడి మీద సినిమా తీయడానికి చాలా ఏళ్ల ముందే ప్రణాళికలు రచించాడు. తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ సినిమా చేయాలనుకున్నాడు. విక్రమ్ హీరోగా ‘మహావీర కర్ణ’ అనే సినిమా అనౌన్స్ అయినా సరే.. అతను వెనక్కి తగ్గలేదు. కానీ అటు విక్రమ్ సినిమా ముందుకు కదల్లేదు. అలాగే సూర్య చిత్రమూ పట్టాలెక్కలేదు.
కర్ణ సినిమా కోసం ఆరేళ్ల పాటు కష్టపడ్డట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ వెల్లడించాడు. స్క్రిప్టుతో పాటు ప్రి ప్రొడక్షన్ మొత్తం పూర్తయిందన్నాడు. అంతే కాక మామూలుగా పాటల కోసం చాలా టైం తీసుకుని, రిలీజ్ ముందు వరకు ఇబ్బంది పెట్టే ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఆరు పాటలను ఎప్పుడో కంపోజ్ చేసినట్లు రాకేష్ వెల్లడించడం విశేషం.
ఐతే ఇంత కష్టపడ్డాక దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయామని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నాడు. అది హోల్డ్లో మాత్రమే పడిందని.. కచ్చితంగా సినిమా ముందుకు కదులుతుందని.. ప్రస్తుతం రెహమాన్ ఆల్రెడీ కంపోజ్ చేసిన పాటకు మెరుగులు దిద్దుతున్నాడని చెప్పాడు.
తన ఊహల్లో కర్ణ పాత్రకు సూర్య తప్ప ఇంకొకరు కనిపించలేదని.. కాబట్టి ఎప్పటికైనా సూర్యతోనే ఆ కథను తెరకెక్కిస్తానని చెప్పాడు రాకేష్. బహుశా ఈ చిత్రానికి బడ్జెట్టే పెద్ద సమస్యగా మారి ఉండొచ్చు. కొన్నేళ్లుగా సూర్య మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో అతను పుంజుకుంటే, అన్నీ వర్కవుట్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.
This post was last modified on February 1, 2026 3:47 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…