మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు సుష్మిత, శ్రీజ.. అబ్బాయి రామ్ చరణ్లకు ఇప్పటిదాకా పుట్టిన సంతానం అంతా అమ్మాయిలే. వారి మీద ఆయనకు వివక్షేమీ లేదు కానీ.. ఒక మనవడు కూడా పుట్టాలన్నది ఆయన కోరిక.
ఈ విషయాన్ని ఇంతకుముందు బహిరంగంగానే చెప్పేశారు మెగాస్టార్. ఇప్పుడు ఆయన కోరికను రామ్ చరణ్, ఉపాసన దంపతులు నెరవేర్చారు. ఇప్పటికే ఒక అమ్మాయికి జన్మనిచ్చిన దంపతలు.. ఇప్పుడు కవల పిల్లల్ని కన్నారు. అందులో ఒకరు అబ్బాయి, ఇంకొకరు అమ్మాయి కావడం విశేషం. దీంతో మెగా ఫ్యామిలీలో, అలాగే అభిమానుల్లో సంతోషానికి అవధులు లేకపోయాయి. నిన్న సాయంత్రం నుంచే సంబరాలు మిన్నంటాయి.
ఐతే చిరుకు మనవడు, చరణ్కు కొడుకు పుట్టినందుకు అభిమానులు సంబరాలు చేసుకోవడం బాగానే ఉంది. కానీ ఆ సంబరాలు కాస్త హద్దులు దాటిపోవడమే విమర్శలకు దారి తీసింది. ఉపాసన డెలివరీ జరిగిన అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో అభిమానులు భారీ స్థాయిలో బాణసంచా కాల్చడం వివాదాస్పదమైంది.
హాస్పిటల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పేషెంట్లు ఉంటారు. కాబట్టి ఇక్కడ బాణసంచా పేలిస్తే వాళ్లందరికీ ఇబ్బంది అని ఆలోచించకుండా అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలను పీఆర్ టీం ముందుండి నడిపించడం పట్ల మరింతగా విమర్శలు వస్తున్నాయి.
ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసినట్లే కనిపిస్తోంది. అభిమానులను నియంత్రించాల్సిన వాళ్లే ఇలా ప్లాన్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రామ్ చరణ్ క్లిన్ కారతో ఆసుపత్రికి చేరుకున్నప్పుడు కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఎప్పుడూ కామ్ గా ఉండే చరణ్ కే కోపం వచ్చింది. చిరు కుటుంబానికి, మెగా అభిమానులకు ఈ మూమెంట్ ఎంతో ప్రత్యేకమైనది అయినప్పటికీ.. అభిమానులు ఎంతగా సమర్థించుకున్నా సరే ఇలా చేయడం తప్పు అనడంలో మరో మాట లేదు.
This post was last modified on February 1, 2026 1:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…