Political News

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌.. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ నాయ‌కుడి ద్వారా తెలిసింది. తాడేప‌ల్లి కేంద్ర కార్యాలయం వ్య‌వ‌హారాలు చూసే ఓ కీల‌క నాయ‌కుడు, ప్ర‌జాప్ర‌తినిధి ఆఫ్ దిరికార్డుగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వ‌చ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బ‌డ్జ‌ట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి.

తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో స‌భ‌లు ప్రారంభం అవుతాయి. అనంత‌రం.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 14న వార్షిక‌(2026-27) బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ స‌మావేశాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. వ‌చ్చే ఏడాదికి ఎన్నిక‌లు స‌మీపించే ఏడాది.. నేప‌థ్యంలో ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లోనే ఆదాయాన్ని పెంచుకునే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. అదేస‌మ‌యంలో కీల‌క ప్రాజెక్టుల‌కు కూడా నిధులు కేటాయించ‌నున్నారు.

అయితే… అసెంబ్లీ స‌మావేశాలు అన‌గానే.. స‌హ‌జంగానే వైసీపీవైపు అంద‌రి దృష్టీ ఉంటుంది. గ‌త 18 మాసాల్లో వైసీపీ నాయకులు స‌భ‌కు రావ‌డం లేదు. తొలిసారి శాస‌న స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు స‌భ‌కు వ‌చ్చారు. త‌ర్వాత‌.. 2025-26 బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు.. గ‌వ‌ర్నర్ ప్ర‌సంగానికి జ‌గ‌న్ తన ఎమ్మెల్యేల‌తో హాజ‌ర‌య్యారు.

అయితే.. అప్ప‌ట్లో వైసీపీ కార్యకర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ వారిపై దాడులు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ.. న‌ల్ల‌కండువాల‌తో జ‌గ‌న్ స‌భ‌కు వ‌చ్చారు. అనంత‌రం.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ప్ర‌సంగ ప్ర‌తుల‌ను చింపి పోసి.. స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

ద‌రిమిలా.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ స‌భ‌కు హాజ‌రు కాలేదు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని, భ‌త్యాల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు రాని స‌భ్యుల‌కు వేత‌నాల్లో కోత పెట్టేలా.. వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించేలా కూడా చేయాల‌న్న‌ది స‌భ ఉద్దేశం.

ఈ చ‌ర్చ ఒక‌వైపు సాగుతున్న క్ర‌మంలోనే తాజాగా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రావాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి హాజ‌రు కావాల‌ని.. త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు.. కీల‌క నేత ద్వారా తెలిసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 1, 2026 3:33 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago