టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్ డ్రాప్ తో ఒకే టైంలో నటించిన సినిమాలు తక్కువే. కానీ ఈసారి ఇది బ్రేకయ్యే అవకాశాలు ఉన్నాయి.
ముందుగా మెగాస్టార్ దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న మూవీకి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నగరంలో జరిగే యాక్షన్ డ్రామాని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. అనస్వర రాజన్ కూతురుగా, మోహన్ లాల్ స్పెషల్ క్యామియోలో మెరవనున్న ఈ సినిమాకు కాక, కాకాజీ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట కానీ ఇంకా ఫైనల్ చేయలేదు.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందబోయే మూవీ కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోనే సాగుతుందని అంతర్గత సమాచారం. ముందు అనుకున్న పీరియాడిక్ సెటప్ కాకుండా పూర్తిగా వేరే సబ్జెక్టుని తీసుకున్న విషయం వెల్లడైంది. ఇది ముంబైలో జరుగుతుందని, బాలయ్య గెటప్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఖాయమని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
అయితే వీటిలో ఏది ముందు వస్తుందనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఏదైనా ఆలస్యమైతే 2027 సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ మరోసారి చూడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణగా చెప్పలేం కానీ వెయిట్ చేయాలి.
గతంలో ఈ ఇద్దరూ గ్యాంగ్ స్టర్స్ గా నటించిన సినిమాలు ఉన్నాయి. చిరంజీవి ఖాతాలో లంకేశ్వరుడు, గాడ్ ఫాదర్, బిగ్ బాస్ ఉండగా బాలయ్య అశోక చక్రవర్తి, యువరత్న రాణా, పైసా వసూల్ లో డాన్ గా కనిపించారు. అయితే ఇవేవీ ఆశించిన విజయాలు సాధించకపోవడం గమనార్హం.
మరి ఇంత సీనియారిటీ వచ్చాక ట్రై చేయడం ఆసక్తి రేపే విషయం. మరో ట్విస్టు ఏంటంటే బాబీ, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు. గోపీచంద్ దగ్గర బాబీ డాన్ శీను, బలుపు లాంటి వాటికి పని చేశారు. బాస్, బాలయ్య ఇద్దరూ ఒకే జానర్ చేసే మాట నిజమైతే మాత్రం అభిమానులకు మంచి విందు. ఖాయం.
This post was last modified on January 28, 2026 7:37 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…