తెర మీద రొమాంటిక్ సీన్లు చూడడం మెజారిటీ ప్రేక్షకులకు బాగానే ఉంటుంది కానీ.. అవి చేయడం మాత్రం నటీనటులకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. తెర మీద హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తారు కానీ.. సెట్లో పదులు, వందల సంఖ్యలో కాస్ట్ అండ్ క్రూ ఉంటారు. వారి మధ్య రొమాన్స్ పండించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
మళ్లీ మళ్లీ టేక్స్ చేయాలంటే ఏదోలా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకే ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఐతే హీరోయిన్ ఓకే అన్నా కూడా దర్శకుడే ఈ సీన్లు తీయడానికి బాగా ఇబ్బంది పడడం గురించి ఎక్కడైనా విన్నామా? తమ సెట్లో అదే జరిగింది అంటోంది ఫంకీ మూవీ హీరోయిన్ కాయదు లోహర్.
ఫంకీలో కాయదు విశ్వక్సేన్కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విశ్వక్తో కాయదుకు రొమాంటిక్ సీన్లు ఉన్నాయట.
విశ్వక్, కాయదులతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆ సీన్ల గురించి మాట్లాడాడు అనుదీప్. రొమాంటిక్ సీన్లు చేయనని కాయదు మొండికేసిందంటూ అనుదీప్ సరదాగా వ్యాఖ్యానించగా.. తన మాటల్ని విశ్వక్ హిందీలోకి అనువదించి చెప్పాడు విశ్వక్.
దీంతో ఆశ్చర్యపోయిన కాయదు.. రొమాంటిక్ సీన్లు చేయడంలో తనకేమీ ఇబ్బంది లేదని.. అనుదీపే వాటిని చేయడానికి తడబడ్డాడని వెల్లడించింది. ఆ సీన్లు తీసేటపుడే పదే పదే అనుదీప్ కట్ కట్ అనేవాడని.. ఆర్టిస్టులకంటే దర్శకుడే అవి చేయడానికి ఇబ్బంది పడ్డాడని చెప్పింది. దీంతో హీరోయిన్కు లేని ఇబ్బంది దర్శకుడికేంటా అని ఈ వీడియో చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు.
జాతిరత్నాలుతో సెన్సేషన్ క్రియేట్ చేశాక.. ప్రిన్స్ మూవీతో నిరాశపరిచాడు అనుదీప్. ఆ తర్వాత అతను రవితేజతో ఓ సినిమా కోసం ప్రయత్నించాడు. అది వర్కవుట్ కాలేదు. ఆపై సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో విశ్వక్, కాయదు కలయికలో ఫంకీ తీశాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 27, 2026 9:01 am
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…