జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు రాజా సాబ్ ప్రస్తావన పదే పదే సోషల్ మీడియాలో తెచ్చి లాభం లేదు. దర్శకుడు మారుతీని ఎంత విమర్శించినా, ఆయన అడ్రెస్సుకి ఎన్ని పార్సిళ్లు పంపించినా లాభముండదు. అవి విల్లా లోపలికి వెళ్లకుండా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కాబట్టి గేటు దగ్గర సెక్యూరిటీ వాడుకోవడం తప్ప ఎవరేం చేయలేరు.
ట్రోలింగ్ మరీ హద్దులు దాటిపోవడంతో ఎస్కెఎన్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తర్వాత ట్విట్టర్ లో కొంత వేడి చల్లారింది. సరే మూడేళ్ళ కష్టానికి ఇలాంటి సినిమా ఇచ్చారనే కోపం ఫ్యాన్స్ లో ఉండొచ్చు కానీ ఇప్పుడీ ప్రస్తావన వదిలేసి మూవాన్ అయ్యే టైం వచ్చింది.
డిజాస్టర్లు అందరికీ ఉంటాయి. ఎవరూ మినహాయింపు కాదు. మొన్న రికార్డులు బద్దలుకొట్టిన మన శంకరవరప్రసాద్ గారుకి ముందు చిరంజీవి చేసిన భోళా శంకర్ మర్చిపోయేది కాదు. సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వెంకటేష్ ట్రాక్ రికార్డు ఎలా ఉండేది.
అఖండకు మునుపు బాలకృష్ణ ఎలాంటి చేదు ఫలితాలు అందుకున్నారో తెలిసిందే. అంతెందుకు లెజెండరీ ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడు శ్రీనాథ కవిసౌర్వభామ, బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తే దారుణంగా పోయాయి. మేజర్ చంద్రకాంత్ తో తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చాటారు. ఆయన చివరి కమర్షియల్ మూవీగా దాని స్థానం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ శక్తి దగ్గర ఆగలేదు. మహేష్ బాబు నాని చూసి బాధ పడలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని గుర్తు పెట్టుకోలేదు. ఎవరికి వారు ఇవన్నీ మాములేనని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నది కూడా ఇదే. స్పిరిట్ మీదే పూర్తి ధ్యాస పెట్టారు.
ఫ్యాన్స్ అర్జెంటుగా కోరుకుంటున్నది ఏంటో గుర్తించి సందీప్ రెడ్డి వంగాకు సరెండర్ అయిపోయి కష్టపడుతున్నాడు. ఫౌజీకి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా పెద్దవి. సో రాజా సాబ్ వదిలేసి డార్లింగ్ ఫ్యాన్స్ ఇకపై వీటికి షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు రాజా సాబ్ స్పూఫ్స్, ట్రోల్స్ మీద సమయం ఖర్చు పెడితే నష్టం వాళ్ళకే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…