Movie News

బాలయ్య కోసం కొత్త కథ రెడీ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా రిలీజయ్యేలా చూసుకోవాలి అనే సూత్రాన్ని ఆయన వంద శాతం పాటిస్తుంటారు. ఒక సినిమా రిలీజయ్యేలోపు ఇంకో చిత్రాన్ని మొదలుపెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటాడు. గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాడు.

కొన్నేళ్లుగా వరుస విజయాలతో సాగిపోతున్న బాలయ్య.. ‘అఖండ-2’ రిలీజైన వెంటనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి ఎప్పుడో అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కానీ ‘అఖండ-2’ అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం, కొత్త సినిమా బడ్జెట్ అదీ మరీ పెద్దదైపోవడంతో టీం పునరాలోచనలో పడింది. ముందు అనుకున్న చారిత్రక కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత తన టీంతో కలిసి ఇంకో కథ మీద కసరత్తులు మొదలుపెట్టాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

అందువల్లే డిసెంబరులోనే మొదలు కావాల్సిన సినిమా కాస్తా సంక్రాంతి తర్వాత కూడా సెట్స్ మీదికి వెళ్లలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి ఆరంభంలో మొదలు కాబోతోందట. రెండు మూడు కొత్త లైన్లు అనుకుని వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసిన గోపీచంద్ అండ్ టీం.. ఒక కథను లాక్ చేసి దానికి ఫుల్ స్క్రిప్టు రెడీ చేసిందన్నది లేటెస్ట్ న్యూస్.

వీరసింహారెడ్డి తరహాలోనే ఇది మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. సాయిమాధవ్ బుర్రా సహకారంతో గోపీచంద్ ఈ స్క్రిప్టు రెడీ చేశారట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకువెళ్లబోతున్నారు. ఇంతకుముందే ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. కానీ కథ మారిన నేపథ్యంలో మరోసారి సింపుల్‌గా ముహూర్త వేడుక జరిపి ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది దసరా రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించనున్నారట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Kumar

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

15 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

42 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

45 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

12 hours ago