టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా రిలీజయ్యేలా చూసుకోవాలి అనే సూత్రాన్ని ఆయన వంద శాతం పాటిస్తుంటారు. ఒక సినిమా రిలీజయ్యేలోపు ఇంకో చిత్రాన్ని మొదలుపెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటాడు. గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాడు.
కొన్నేళ్లుగా వరుస విజయాలతో సాగిపోతున్న బాలయ్య.. ‘అఖండ-2’ రిలీజైన వెంటనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి ఎప్పుడో అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కానీ ‘అఖండ-2’ అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం, కొత్త సినిమా బడ్జెట్ అదీ మరీ పెద్దదైపోవడంతో టీం పునరాలోచనలో పడింది. ముందు అనుకున్న చారిత్రక కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత తన టీంతో కలిసి ఇంకో కథ మీద కసరత్తులు మొదలుపెట్టాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
అందువల్లే డిసెంబరులోనే మొదలు కావాల్సిన సినిమా కాస్తా సంక్రాంతి తర్వాత కూడా సెట్స్ మీదికి వెళ్లలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి ఆరంభంలో మొదలు కాబోతోందట. రెండు మూడు కొత్త లైన్లు అనుకుని వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసిన గోపీచంద్ అండ్ టీం.. ఒక కథను లాక్ చేసి దానికి ఫుల్ స్క్రిప్టు రెడీ చేసిందన్నది లేటెస్ట్ న్యూస్.
వీరసింహారెడ్డి తరహాలోనే ఇది మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. సాయిమాధవ్ బుర్రా సహకారంతో గోపీచంద్ ఈ స్క్రిప్టు రెడీ చేశారట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకువెళ్లబోతున్నారు. ఇంతకుముందే ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. కానీ కథ మారిన నేపథ్యంలో మరోసారి సింపుల్గా ముహూర్త వేడుక జరిపి ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది దసరా రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించనున్నారట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
This post was last modified on January 23, 2026 6:25 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…