‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రలో అందం, అభినయంతో మెప్పించిన అమ్మాయి ఫరియా అబ్దుల్లా. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. ‘జాతిరత్నాలు’ లాంటి మరో మంచి బ్రేక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ కథానాయికగా నటించిన లవ్ షేర్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు తనకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
‘మత్తు వదలరా-2’ హిట్టయినా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం సత్య మీద నిలిచి, ఫరియాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇటీవలే ‘గుర్రం పాపిరెడ్డి’తో పలకరించిన ఫరియాకు ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా ఫరియాకు అవకాశాలకైతే లోటు లేనట్లే కనిపిస్తోంది. ఓవైపు కథాానాయికగా నటిస్తూ.. చిన్న చిన్న పాత్రలూ చేస్తూ ముందుకు సాగోతోంది. ఫరియా వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెల్లడైంది. ఆమె రిలేషన్షిప్లో ఉందట.
హీరోయిన్ల ప్రేమాయణం గురించి మీడియాలో ఊహాగానాలు రావడమే కానీ.. వాళ్లకు వాళ్లుగా దాని గురించి ఓపెన్ కావడం అరుదు. ఫరియా ఆ పనే చేసింది. కాకపోతే తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పకుండా తనేం చేస్తాడో మాత్రం వెల్లడించింది. ఫరియా ప్రేమిస్తున్న వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వాడేనట. అతనొక కొరియోగ్రాఫరట. కొన్నేళ్లుగా ఫరియా అతడితో రిలేషన్షిప్లో ఉందట.
‘‘కొంత కాలంగా నా డ్యాన్స్, ర్యాప్లో మార్పు రావడానికి నా బాయ్ఫ్రెండే కారణం. అతను సినీ రంగానికి చెందిన వ్యక్తే. కొరియోగ్రఫీలో తన ప్రతిభతో ముందుకు వెళ్తున్నాడు. మేమిద్దరం కలిసి పని చేస్తూ ఒక టీంగా ముందుకు వెళ్తున్నాం. మాది కేవలం ప్రేమ బంధం మాత్రమే కాదు. జీవితానికి సంబంధించి బలమైన అనుబంధం. ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక నా బాయ్ ఫ్రెండ్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని ఫరియా తెలిపింది. తన ప్రియుడు కొరియోగ్రాఫర్ అని ఫరియా హింట్ ఇవ్వడంతో.. ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
This post was last modified on January 23, 2026 12:39 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…