టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ముగిసింది, బాక్సాఫీస్ దగ్గర లెక్కలు తేలిపోయాయి. ఈ ఏడాది మూడు సినిమాలు హిట్గా నిలిస్తే, మరో రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు, ముఖ్యంగా అందులో ఒకటి డిజాస్టర్ అయ్యింది. అయితే మార్కెట్లో పాజిటివ్ సందడి కనిపించినా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఒక కొత్త భయం మొదలైంది. అదే ‘సంక్రాంతి ఓవర్లోడ్’. గతంలో రెండు మూడు సినిమాలు ఉంటేనే ఎక్కువ అనుకునేవాళ్లం, కానీ ఇప్పుడు ఆ కౌంట్ ఐదు దాటేసింది. వచ్చే ఏడాది ఇది ఇంకా పెరిగినా పెరగొచ్చు.
ఈ సంక్రాంతి నేర్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే.. కంటెంట్ ఉంటేనే కింగ్. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాజాసాబ్’ ఉన్నా, మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్రాండ్ గా వచ్చినా.. మిగతా సినిమాలు ఏమాత్రం భయపడకుండా పోటీకి దిగాయి. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. నిజంగా మూడు సినిమాలే వచ్చి ఉంటే, ఈ హిట్ సినిమాల కలెక్షన్స్ రేంజ్ మరోలా ఉండేది. పండగ రద్దీ పెరిగిపోవడం వల్ల ఆడియన్స్ డివైడ్ అయిపోయి, సినిమాల ఫుల్ పొటెన్షియల్ బయటకు రావడం లేదు.
థియేటర్ల లెక్క కూడా ఇప్పుడు ఇష్టానుసారంగా మారుతోంది. మొదట దొరికినన్ని థియేటర్లలో రిలీజ్ చేసి, ఆ తర్వాత టాక్ ని బట్టి షోలు పెంచుకోవచ్చు అనే ధీమా ఎక్కువైపోతోంది. ఇది చిన్న సినిమాలకు ప్లస్ అనిపిస్తున్నా, లాంగ్ రన్ లో మాత్రం మైనస్ అవుతోంది. మెగాస్టార్ MSG సినిమాకు సాలిడ్ టాక్ రావడంతో ఆడియన్స్ అటు డైవర్ట్ అయ్యారు, అలాగే నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ తనదైన కామెడీతో మ్యాజిక్ చేసింది. దీంతో యావరేజ్ టాక్ వచ్చిన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి సినిమాలకు గట్టి డ్యామేజ్ జరిగింది.
శర్వానంద్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’కి కూడా మంచి టాక్ వచ్చింది, కానీ పండగ హడావుడిలో లైమ్ లైట్ లోకి రావడం ఆలస్యమైంది. థియేటర్లు తక్కువగా ఉండటం, మిగతా సినిమాల పోటీ వల్ల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. గతంలో ‘శతమానం భవతి’ టైమ్లో ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి శర్వాకు సాలిడ్ నంబర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఓవర్లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల సూపర్ హిట్ కావాల్సిన సినిమా ఇప్పుడు హిట్ దగ్గరే ఆగిపోయింది.
సంక్రాంతి రేసులో పోటీ ఉండటం మంచిదే కానీ, అది పరిమితి దాటితే సినిమాల కెపాసిటీకి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఏ సినిమాకూ వారం రోజుల పాటు కూడా నిలకడగా థియేటర్లు దొరకడం లేదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది 6 నుంచి 7 సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంటెంట్ మీద నమ్మకం ఉండి బరిలోకి దిగుతున్నారా లేక పండగ సీజన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా అనేది మేకర్స్ ఆలోచించుకోవాల్సిన విషయం.
This post was last modified on January 23, 2026 7:57 am
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…