రేపు బాలీవుడ్ మల్టీస్టారర్ బోర్డర్ 2 విడుదల కానుంది. 1997లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుగా రూపొందిన ఈ వార్ డ్రామా ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లెన్త్ తో దురంధర్ ఆల్ టైం రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
యానిమల్, పుష్ప 2 ఇదే దారిలో గొప్ప విజయాలు అందుకున్నాయి. అలాంటప్పుడు బోర్డర్ 2కి వచ్చిన సమస్యేంటని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చు. కానీ ఇలాంటి యుద్ధ నేపథ్యంలో సాగే సినిమాలలో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఎలివేషన్ కు చోటు కల్పించినప్పటికీ భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అలాంటప్పుడు మూడున్నర గంటల పాటు ఇలాంటి కంటెంట్ అంగీకరించడం అంత సులభంగా ఉండదు. గతంలో బోర్డర్ 2 నిర్మాత జెపి దత్తా ఎల్ఓసి లైన్ అఫ్ కంట్రోల్ ని నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేశారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందరో స్టార్లు దాంట్లో భాగమయ్యారు. కానీ రెండు వందల నలభై నిమిషాల యుద్ధాన్ని ఆడియన్స్ భరించలేక ఫ్లాప్ చేశారు.
అత్యంత పొడవైన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోవడం తప్ప ఎల్ఓసి సాధించింది ఏమి లేదు. బోర్డర్ 2 ని డైరెక్ట్ చేసింది దత్తా కాకపోయినా కథ, పర్యవేక్షణ మొత్తం ఆయనదే. పైగా నిర్మాణ భాగస్వామి కూడా. దర్శకత్వం అనురాగ్ సింగ్ కు అప్పగించారు.
రాజా సాబ్ ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అక్కడి ట్రేడ్ ఆశలన్నీ బోర్డర్ 2 మీదే ఉన్నాయి. ఇది కూడా మొదటి భాగంలాగే 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందింది. కాకపోతే వేరే ఘట్టాలను తీసుకుని విఎఫ్ఎక్స్, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు చాలా వాడారు.
ముఖ్యంగా సన్నీ డియోల్ అభిమానులు చాలా అంచనాలు పెట్టేసుకున్నారు. లెన్త్ ఏ మాత్రం తేడా కొట్టినా, ఎక్కువనిపించినా టాక్ పరంగా తేడా వచ్చేస్తుంది. వరుణ్ ధావన్, దిల్జిత్, అహాన్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన బోర్డర్ 2 సెంటర్ అఫ్ అట్రాక్షన్ మాత్రం సన్నీ డియోలే. చూడాలి మరి ఏ మేరకు మెప్పిస్తారో.
This post was last modified on January 22, 2026 5:06 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…