Trends

లోయలో పడ్డ ఆర్మీ వాహనం… 10 మంది జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన భదర్వా ప్రాంతంలోని ఖన్నీ టాప్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

సైనిక వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్‌ వైపు వెళ్తుండగా, భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మొదట నలుగురు చనిపోయారని భావించినా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య 10కి పెరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ప్రత్యేక చికిత్స కోసం ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.

జవాన్ల నిరుపమాన సేవలను, వారి త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కమాండ్ హాస్పిటల్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు కురుస్తున్న ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రాణాలతో బయటపడిన జవాన్ల కోసం వైద్య బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

This post was last modified on January 22, 2026 5:19 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

12 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

17 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

37 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

4 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

9 hours ago