జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన భదర్వా ప్రాంతంలోని ఖన్నీ టాప్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
సైనిక వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్ వైపు వెళ్తుండగా, భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మొదట నలుగురు చనిపోయారని భావించినా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య 10కి పెరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ప్రత్యేక చికిత్స కోసం ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.
జవాన్ల నిరుపమాన సేవలను, వారి త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కమాండ్ హాస్పిటల్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు కురుస్తున్న ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రాణాలతో బయటపడిన జవాన్ల కోసం వైద్య బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
This post was last modified on January 22, 2026 5:19 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…