త్రివిక్రమ్తో సినిమా చేయడానికి మహేష్ ఆమధ్య గట్టిగానే ప్రయత్నించాడు. ఖలేజా రిలీజ్ అయి పది సంవత్సరాలయిన సందర్భంగా మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా అతి త్వరలో వస్తోందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ మలి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ వెంటనే మహేష్ సినిమా స్టార్ట్ చేయలేకపోయాడు. ఈలోగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెడుతున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు హడావిడి చేసారు. దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమా పక్కకెళ్లిపోయింది. ఇప్పటికీ తారక్ జనవరికి అయినా రాకపోతే త్రివిక్రమ్ వేరే సినిమా ఏదయినా చేసేస్తాడనే వార్తలొస్తున్నాయి. అయితే మహేష్తో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చు. ఎందుకంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసే సమయానికి తారక్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా వుంటాడు. అదయ్యే నాటికి రాజమౌళి సినిమా కోసం మహేష్ సమాయత్తమవుతుంటాడు.
అందుకే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు రాదు. కానీ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ మరో చిత్రం చేయాలని చూస్తున్నాడు. అయిదారు నెలల వ్యవధిలో షూటింగ్ చేయగల డైరెక్టర్తో పని చేస్తాడు. అంటే అంత వేగంగా ఇంత పెద్ద సినిమా తీయగల దర్శకులు పూరి జగన్నాథ్ లేదా అనిల్ రావిపూడి మాత్రమే కనుక ఆ ఇద్దరిలో ఎవరొకరితో మహేష్ తదుపరి చిత్రం వుండొచ్చు.
This post was last modified on December 14, 2020 9:23 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…