త్రివిక్రమ్తో సినిమా చేయడానికి మహేష్ ఆమధ్య గట్టిగానే ప్రయత్నించాడు. ఖలేజా రిలీజ్ అయి పది సంవత్సరాలయిన సందర్భంగా మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా అతి త్వరలో వస్తోందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ మలి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ వెంటనే మహేష్ సినిమా స్టార్ట్ చేయలేకపోయాడు. ఈలోగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెడుతున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు హడావిడి చేసారు. దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమా పక్కకెళ్లిపోయింది. ఇప్పటికీ తారక్ జనవరికి అయినా రాకపోతే త్రివిక్రమ్ వేరే సినిమా ఏదయినా చేసేస్తాడనే వార్తలొస్తున్నాయి. అయితే మహేష్తో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చు. ఎందుకంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసే సమయానికి తారక్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా వుంటాడు. అదయ్యే నాటికి రాజమౌళి సినిమా కోసం మహేష్ సమాయత్తమవుతుంటాడు.
అందుకే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు రాదు. కానీ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ మరో చిత్రం చేయాలని చూస్తున్నాడు. అయిదారు నెలల వ్యవధిలో షూటింగ్ చేయగల డైరెక్టర్తో పని చేస్తాడు. అంటే అంత వేగంగా ఇంత పెద్ద సినిమా తీయగల దర్శకులు పూరి జగన్నాథ్ లేదా అనిల్ రావిపూడి మాత్రమే కనుక ఆ ఇద్దరిలో ఎవరొకరితో మహేష్ తదుపరి చిత్రం వుండొచ్చు.
This post was last modified on December 14, 2020 9:23 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…