ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. బన్నీ రేంజ్ ఎంతో పెరిగిపోయింది. అదే సమయంలో మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబానికి కొంచెం గ్యాప్ కూడా వచ్చిందనే మాట మీడియాలో బలంగా చక్కర్లు కొడుతుంది.
అభిమానుల్లోనూ చీలిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిరును, ఆయన సినిమాను బన్నీ మెచ్చుకున్నా.. బన్నీని, తన మూవీని చిరు కొనియాడినా అది వార్తే అవుతోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. సంక్రాంతికి విడులైన సెన్సేషనల్ హిట్టయిన మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ను బన్నీ చూశాడు. ఇన్స్టాగ్రామ్లో లెంగ్తీ పోస్టు పెట్టి ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేశాడు. ఇంతకీ ఈ పోస్టులో బన్నీ ఏమన్నాడంటే..?
‘‘మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. ది బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి గార్లు మళ్లీ స్క్రీన్లను తగలబెట్టేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వింటేజ్ వైబ్స్ వచ్చాయి. వెంకటేష్ గారు అదరగొట్టేశారు. #వెంకీ గౌడ తుంబ చెన్నాగి మాడిదిరా (చాలా బాగా చేశారు). నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. కేథరిన్ సరదాగా చేసింది. సంక్రాంతి స్టార్ బుల్లి రాజుతో పాటు మిగతా నటీనటులందరూ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్లు ఇచ్చారు.
హుక్ స్టెప్, మెగా విక్టరీ సహా పాటలన్నీ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి. సాంకేతిక నిపుణులందరూ మంచి పనితనం చూపించారు. నిర్మాతల్లో ఒకరైన నా ప్రియమైన కజిన్ సుష్మిత కొణిదెలతో పాటు సాహు గారపాటికి అభినందనలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి గారికి భారీ శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీటు. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్బస్టర్ కాదు.. సంక్రాంతి బాస్బస్టర్’’ అని ముగించాడు బన్నీ.
This post was last modified on January 20, 2026 4:15 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…