Movie News

ట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూ

రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సాధారణంగా సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గడం సహజం.

అయితే వరప్రసాద్ గారుకి వచ్చింది యునానిమస్ ఎక్స్ ట్రాడినరి టాక్. ఏబిసి సెంటర్లు తేడా లేకుండా అన్ని చోట్ల భారీ నెంబర్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు ఎగిరిపోయాయి. ఏడో రోజు అత్యధిక గ్రాస్ నమోదు చేసిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు అందుకుంది. సో డ్రాప్ ఎక్కువగా ఉండకూడదు.

కానీ ఏపీలో చాలా చోట్ల జిఓ ప్రకారం పెంచిన రేట్లే ఉంచారు. బుధవారం దాకా ఇలాగే ఉండబోతున్నాయి. అంటే వీక్ డేస్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటె బుకింగ్ ఛార్జ్ కాకుండా 302 రూపాయలు చెల్లించాలి. సింగల్ స్క్రీన్ లోనూ 218 రూపాయల దాకా ఉంది. ఇది సామాన్యులను దూరం చేసే ధర.

ఎలాగూ సెలవులు అయిపోయాయి కాబట్టి మండే నుంచే నార్మల్ రేట్లు పెట్టి ఉంటే వరప్రసాద్ జోరు కొంచెం కూడా తగ్గేది కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల సిడెడ్ లాంటి ఏరియాల్లో అంకెలు కాస్త తగ్గాయి. తెలంగాణలో గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన ధరలు ఆల్రెడీ అమలులోకి తెచ్చేశారు.

అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన మరోలా ఉండొచ్చు. ఎలాగూ ఇంకో రెండు వారాల దాకా బలమైన కాంపిటీషన్ లేదు కాబట్టి వీలైనంత వరప్రసాద్ నుంచి రాబట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబోలు. మూమెంట్ ఇలాగే కొనసాగితే నాలుగు వందల మార్కు అసాధ్యం కాదు. కాకపోతే డౌన్ అవుతున్న ట్రెండ్ ని నిలబెట్టే బాధ్యత టికెట్ రేట్ల మీద ఉంది.

అనగనగా ఒక రాజుకి  సైతం ఈ సమస్య ఉంది. 50, 75 రూపాయలు పెంపు తీసుకోవడం వల్ల ఇది కూడా ఆక్యుపెన్సీ డ్రాప్ చూస్తోంది. నిర్మాతలు వీలైనంత త్వరగా ఇలాంటివి గమనించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా అవసరం.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

3 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

35 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago