రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సాధారణంగా సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గడం సహజం.
అయితే వరప్రసాద్ గారుకి వచ్చింది యునానిమస్ ఎక్స్ ట్రాడినరి టాక్. ఏబిసి సెంటర్లు తేడా లేకుండా అన్ని చోట్ల భారీ నెంబర్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు ఎగిరిపోయాయి. ఏడో రోజు అత్యధిక గ్రాస్ నమోదు చేసిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు అందుకుంది. సో డ్రాప్ ఎక్కువగా ఉండకూడదు.
కానీ ఏపీలో చాలా చోట్ల జిఓ ప్రకారం పెంచిన రేట్లే ఉంచారు. బుధవారం దాకా ఇలాగే ఉండబోతున్నాయి. అంటే వీక్ డేస్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటె బుకింగ్ ఛార్జ్ కాకుండా 302 రూపాయలు చెల్లించాలి. సింగల్ స్క్రీన్ లోనూ 218 రూపాయల దాకా ఉంది. ఇది సామాన్యులను దూరం చేసే ధర.
ఎలాగూ సెలవులు అయిపోయాయి కాబట్టి మండే నుంచే నార్మల్ రేట్లు పెట్టి ఉంటే వరప్రసాద్ జోరు కొంచెం కూడా తగ్గేది కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల సిడెడ్ లాంటి ఏరియాల్లో అంకెలు కాస్త తగ్గాయి. తెలంగాణలో గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన ధరలు ఆల్రెడీ అమలులోకి తెచ్చేశారు.
అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన మరోలా ఉండొచ్చు. ఎలాగూ ఇంకో రెండు వారాల దాకా బలమైన కాంపిటీషన్ లేదు కాబట్టి వీలైనంత వరప్రసాద్ నుంచి రాబట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబోలు. మూమెంట్ ఇలాగే కొనసాగితే నాలుగు వందల మార్కు అసాధ్యం కాదు. కాకపోతే డౌన్ అవుతున్న ట్రెండ్ ని నిలబెట్టే బాధ్యత టికెట్ రేట్ల మీద ఉంది.
అనగనగా ఒక రాజుకి సైతం ఈ సమస్య ఉంది. 50, 75 రూపాయలు పెంపు తీసుకోవడం వల్ల ఇది కూడా ఆక్యుపెన్సీ డ్రాప్ చూస్తోంది. నిర్మాతలు వీలైనంత త్వరగా ఇలాంటివి గమనించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా అవసరం.
This post was last modified on January 19, 2026 7:04 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…