మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి పని చేయడానికి వేరే భాషల స్టార్లు అమితాసక్తి చూపిస్తారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. తమిళంలో విజయ్తో కలిసి ఆయన చేసిన జిల్లా బ్లాక్బస్టర్ అయింది. తెలుగులో ఎన్టీఆర్తో చేసిన జనతా గ్యారేజ్ కూడా బ్లాక్బస్టరే. హిందీలోనూ కంపెనీ లాంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్నారాయన.
లాల్ ఉంటే ఆయన పాత్ర సినిమాలో ఎంత హైలైట్ అవుతుందో తెలిసిందే. ఏదైనా ప్రత్యేక పాత్ర చేశారంటే ఆ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తారాయన. అలాంటి నటుడు బాహుబలితో తిరుగులేని స్థాయిని అందుకుని, పాన్ ఇండియా సూపర్ స్టార్గా మారిన ప్రభాస్తో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తోంది కదా.
ఈ కలయికను నిజం చేయడానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా ఇటీవలే ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ నిర్మాతలే ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసి సలార్ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు మోహన్లాల్ను తీసుకోవాలని చూస్తున్నారట.
సలార్ అంటే రాజుకు కుడిభుజంగా ఉండే వ్యక్తి అంటూ ప్రశాంత్ ఇచ్చిన వివరణను బట్టి రాజు పాత్రను లాల్ ఏమైనా చేస్తాడేమో అనిపిస్తోంది. ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. రూ.20 కోట్ల దాకా పారితోషకం కూడా ఆఫర్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజంగా ప్రభాస్, లాల్ కాంబినేషన్ ఓకే అయితే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్కు వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. దక్షిణాదిన అంతటా ఈ చిత్రానికి తిరుగులేని క్రేజ్ వస్తుంది. మరి ఈ కలల కాంబినేషన్ నిజమవుతుందేమో చూడాలి.
This post was last modified on December 14, 2020 11:02 am
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…