Movie News

ఆ స్టార్లూ ఈ స్టార్లూ హైదరాబాద్‌కే..

కరోనా టైంలో షూటింగుల్లేక స్టూడియోలన్నీ దారుణంగా దెబ్బ తిన్నాయి. హైదరాబాద్ స్టూడియోలు అందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీ ఉన్నది హైదరాబాద్‌లోనే. దాంతో సహా అన్నీ కరోనా టైంలో కళ తప్పి నష్టాలు చవిచూశాయి. ఐతే లాక్ డౌన్ షరతులు సడలించి షూటింగ్‌లకు మళ్లీ అనుమతులు లభించిన కొంత కాలానికి మళ్లీ స్టూడియోలన్నీ కళకళలాడుతున్నాయి.

ఇప్పుడైతే హైదరాబాద్ స్టూడియోలు కరోనా ముందు కంటే ఎక్కువగా షూటింగ్‌లతో సందడిగా మారడం విశేషం. తెలుగు సినిమాలే కాదు.. వేరే భాషల చిత్రాలు సైతం హైదరాబాద్‌లోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కరోనా షరతుల మధ్య ఔట్ డోర్‌లో షూటింగ్ చేయడం చాలా కష్టమవుతోంది. చిన్న స్టూడియోల్లో అన్నా షూటింగ్ కష్టమే.

అందుకే విశాలమైన స్టూడియోలనే ఫిలిం మేకర్లు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీకి మామూలు డిమాండ్ లేదిప్పుడు. అక్కడ దాదాపు ప్రతి ఫ్లోర్ ఫుల్ అయిపోయిందట. ఫిలిం సిటీలో ఎటు వైపు చూసినా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఖాళీగా ఉంచిన భవనాలు, ఫ్లోర్లలోనూ ఇప్పుడు చిత్రీకరణలు జరుగుతున్నాయి.

ఇటీవలే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో ‘మే డే’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోనే మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యలో పక్కన పెట్టిన ‘అన్నాత్తె’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కే వస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా సైతం షూటింగ్ కోసం హైదరాబాద్ రానుంది. కన్నడ స్టార్ సుదీప్ సైతం తన ‘ఫాంటమ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే చేశాడు. వీటిలో మెజారిటీ షూటింగ్స్‌కు ఫిలిం సిటీ వేదిక అవుతోంది. వీటితో పాటు తెలుగు సినిమాలు కూడా చాలానే అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అన్నపూర్ణ స్టూడియో సైతం షూటింగ్స్‌తో ఫుల్ ప్యాక్ అయినట్లు సమాచారం.

This post was last modified on December 13, 2020 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైత్రీ తో సినిమా తీయ్.. బాలీవుడ్‌లో పాగా వెయ్!

తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…

27 minutes ago

ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…

1 hour ago

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

2 hours ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

2 hours ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

2 hours ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

3 hours ago