అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్ కోసం థియేటర్లు ముస్తాబు అవుతుండేవి. ఓవర్సీస్లో మరి కొన్ని గంటల్లో ప్రిమియర్స్ కూడా మొదలైపోయేవి. విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’కు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చుండేవి. బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. కానీ సెన్సార్ సమస్యలతో ఈ సినిమా రిలీజ్ అనూహ్యంగా ఆగిపోయింది.
వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా.. రేపు ఉదయమే తీర్పు వెలువురించాల్సి ఉండడంతో రిలీజ్ వాయిదా వేయడం అనివార్యమైంది. దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మామూలు ఇబ్బంది తలెత్తలేదు. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టారు. భారీ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండియాలో కూడా కొన్ని రోజుల కిందట బుకింగ్స్ మొదలుపెట్టారు. సినిమాకు సెన్సార్ కాకముందే పెద్ద ఎత్తున టికెట్లు అమ్మారు.
కానీ ‘జననాయగన్’ అనూహ్యంగా వాయిదా పడిపోవడంతో అమ్మిన టికెట్లన్నీ రద్దయిపోయాయి. తమిళనాడులో పూర్తి స్థాయిలో టికెట్ల అమ్మకం మొదలు కాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ జరగకపోయినా.. వరల్డ్ వైడ్ ‘జననాయగన్’కు రూ.60 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం.
ఒక్క ఉత్తర అమెరికాలో మాత్రమే ఈ సినిమా ప్రి సేల్స్తోనే 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇంకా పలు దేశాల్లో పెద్ద ఎత్తున టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా వాయిదా అని తేలడానికి ముందు వరల్డ్ వైడ్ ప్రి సేల్స్ మొత్తం రూ.60 కోట్లకు చేరింది.
నిన్న రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సినిమా వాయిదా అని ప్రకటించగానే టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసి ఈ రూ.60 కోట్ల రీఫండ్ మొదలుపెట్టాయి వరల్డ్ వైడ్ థియేటర్ ఛైన్స్. ఈ స్థాయిలో టికెట్లు అమ్మి.. రిలీజ్ కోసం పెద్ద ఎత్తున థియేటర్లు సిద్ధం చేసి, అన్ని ఏర్పాట్లూ చేశాక ఇలా సినిమా వాయిదా పడడం, రీఫండ్స్ ఇవ్వడం ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టం భారీగానే ఉంటుంది. సినిమాకు మళ్లీ ఇంత మంచి డేట్ దొరుకుతుందా.. బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు ఉంటాయా.. అప్పుడు ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటుందా అన్నది సందేహమే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…