Movie News

‘నా కూతురిని అతనే చంపేశాడు’

సినీ పరిశ్రమ 2020లో ఎన్నో విషాదాలు చూసింది. కరోనా కారణంగా, వేరే అనారోగ్యాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొందరు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. తాజాగా తమిళ టీవీ నటి, వీడియో జాకీ అయిన చిత్ర అర్ధంతరంగా తనువు చాలించడం అక్కడి వారిని విషాదంలో ముంచెత్తింది. ఈ ఉదంతం మీడియాలో సంచలనం రేపింది.

తనకు నచ్చిన వ్యక్తిని కొంత కాలం కిందటే రహస్యంగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్లు కనిపించిన చిత్ర ఇలా హఠాత్తుగా చనిపోతుందని అనుకోలేదని సన్నిహితులు అంటున్నారు. ఆమెది ఆత్మహత్యా హత్యా అనే విషయంలో స్పష్టత లేదు. ఒక షూటింగ్ కోసం తాను ఉంటున్న హోటల్ గదిలో విద్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా ప్రాథమికంగా తేలింది.

ఐతే విద్య ముఖం మీద, ఒంటి మీద గాయాలుండటంతో అనుమానాలు రేగాయి. తన కూతురిది ఆత్మహత్య కాదని, ఆమెను తన భర్త హేమంతే చంపేసి ఉంటాడని చిత్ర తల్లి ఆరోపించింది. ‘‘చిత్ర-హేమంత్ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. కొన్ని నెలల కిందట రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఐతే తమ పెళ్లి గురించి అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి అందరి సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అంతుబట్టడం లేదు. కానీ తన ముఖంపై, ఒంటిపై గాయాలున్నాయి. ఆమెను హేమంత్ కొట్టి చంపేసి ఉంటాడు. తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నాటకం ఆడుతున్నాడు’’ అని చిత్ర తల్లి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు చిత్ర మృతిపై ఇంకా ఏమీ నిర్ధారించలేదు.

This post was last modified on December 12, 2020 4:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

5 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

7 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

13 hours ago