బిగ్బాస్ సీజన్ 4 చివరి వారానికి చేరుకుంటోంది. శనివారం వచ్చేసింది కాబట్టి ఇక చివరిగా మిగిలే అయిదుగురు ఎవరనేది సాయంత్రానికి తెలిసిపోతుంది. ఈ సీజన్లో ఏ టాస్క్ ఇచ్చినా కానీ అతి తెలివితో ఆలోచించి ఎవరూ సరిగ్గా ఆడలేదు. ఎక్కడ జనం దృష్టిలో బ్యాడ్ అవుతారోననే భయంతో కొందరు చాలా సేఫ్ ఆడేసారు. ఆడియన్స్ కూడా కెమెరాల ముందు నటిస్తోన్న కొందరిని గుర్తించలేక పప్పులో కాలేసారు. అటు చేసి, ఇటు చేసి చివరకు మిగిలిన ఆరుగురిలో కొందరు అనర్హులున్నారు. ఈ సీజన్ ఎంత నిస్సారంగా నడిచిందంటే టాప్ 5 ఎవరనేది తేలిపోయే వారంలో కూడా ఒక్క రోజుల్లో గంట సేపు వేసుకునే కంటెంట్ బిగ్బాస్కు దొరకడం లేదు. పది గంటలకు షో టైమ్ని మార్చేసిన బిగ్బాస్ మొత్తంగా గంట సేపు మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అందులో పావుగంట యాడ్లే వుంటాయి. దీన్ని బట్టి ఈ సీజన్ ఎంత యూజ్లెస్గా తయారయిందనేది అర్థమవుతోంది.
దీనికి తోడు ఎవరిని బయటకు పంపించాలనే విషయంలో హౌస్మేట్స్ కుతంత్రాలు రచించడం కూడా ప్రేక్షకుల కన్ను కప్పుతోంది. ఓట్లు వేసేది ఎక్కువగా యువత కావడంతో చాలా మందికి వ్యక్తిత్వాన్ని అనలైజ్ చేసి ఓట్లు వేసే పరిణితి లేదు. గత వారం మోనల్ తనను తన్నిందంటూ అవినాష్ నానా హంగామా చేసాడు. అది పొరపాటున జరిగిన విషయం అయినా కానీ ఆమెను బ్యాడ్ చేసి తాను బతికిపోవాలని ట్రై చేసాడు. అలాగే ఈవారం అతడి స్నేహితురాలు అరియానా అదే సూత్రం అప్లయ్ చేసింది. సోహైల్ని రెచ్చగొట్టి మరీ అతడి దగ్గర మహిళలకు భద్రత లేదనే సందేశాన్ని జనంలోకి పంపించాలని చూసింది. ఇక జనం మెప్పు పొందిన అభిజీత్ ఎక్కడున్నాడనేది వెతుక్కోవాల్సి వస్తోంది. బిగ్బాస్ ఎడిటర్లు అతడిని, హారికను బ్యాక్గ్రౌండ్కే పరిమితం చేసేస్తూ శాడిజం చూపిస్తున్నారు.
This post was last modified on December 12, 2020 12:58 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…