ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా నిలుస్తుంది ‘దృశ్యం’. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం ఆ భాషలో రికార్డ్ బ్రేకింగ్ హిట్గా నిలిచి.. తర్వాత వివిధ భాషల్లో రీమేక్ అయింది. ప్రతిచోటా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ చిత్రాన్ని చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో కూడా రీమేక్ చేయడం విశేషం.
‘దృశ్యం’కు కొనసాగింపుగా వచ్చిన ఫస్ట్ సీక్వెల్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. రీచ్, వసూళ్ల పరంగా చూస్తే హిందీ వెర్షన్ దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది. అక్కడ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తే.. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో గత ఏడాదే ‘దృశ్యం-3’ని అనౌన్స్ చేశారు మోహన్ లాల్, జీతు జోసెఫ్. ఐతే అక్కడ ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే హిందీ వెర్షన్ను మొదలుపెట్టాలనుకున్నారు.
కానీ జీతు అండ్ టీం అందుకు అభ్యంతరం చెప్పింది. ముందుగా మలయాళ వెర్షనే రావాలంది. అందుకే హిందీ ‘దృశ్యం-3’ టీం షూటింగ్ను వాయిదా వేసుకుంది. రిలీజ్ డేట్ కూడా వెనక్కి జరిపింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ‘దృశ్యం-3’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ టీజర్ లాంచ్ చేసింది. సొసైటీ తనకు ఎన్నో పేర్లు ఇచ్చిందని.. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని.. ఫ్యామిలీ కోసం తాను ఎంత దూరం అయినా వెళ్తానని అజయ్ వాయిస్ ఓవర్తో ఈ గ్లింప్స్ సాగింది. ఈసారి ‘దృశ్యం’ కథను ముగించబోతున్నట్లు ఇందులో సంకేతాలు ఇచ్చింది చిత్ర బృందం.
హిందీలో అజయ్ సరసన శ్రియ మరోసారి నటిస్తుండగా.. లేడీ పోలీసాఫీసర్ పాత్రలో టబు కనిపించనుంది. మరోవైపు మలయాళ వెర్షన్ షూట్ ఆల్రెడీ పూర్తయింది. ఆ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేసే అవకాశముంది. మరోవైపు జీతు జోసెఫ్ వెంకటేష్ హీరోగా తెలుగు వెర్షన్ను కూడా చకచకా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ చిత్రం హిందీ దసరా కానుకగా రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరి త్రివిక్రంతో చేస్తున్న ఆదర్శ కుటుంబంతో పాటు దృశ్యం 3 కూడా చక చకా పూర్తి చేస్తారేమో చూడాలి.
This post was last modified on December 23, 2025 9:12 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…