Movie News

ఏపీలో నంది అవార్డులు అప్పుడే

ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో నంది అవార్డుల‌కు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జ‌నాలు ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. ఆ అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు. కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాక‌ క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా ఈ అవార్డుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది. ఐతే ఈ మ‌ధ్య తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చింది. పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించి వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా నంది అవార్డుల‌కు తిరిగి ప్రాణం పోయ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లున్నాయి. తాజాగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డుల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఉగాదికి నంది అవార్డుల వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. దీంతో పాటుగా నంది నాట‌కోత్స‌వాలు కూడా జ‌రుగుతాయ‌ని ఆయన చెప్పారు. ఉగాదికి నంది అవార్డులు ఇవ్వాలంటే.. ఇప్ప‌టి నుంచే అవార్డుల ఎంపిక కోసం ప‌ని మొద‌లుపెట్టాలి. ఇందుకోసం జ్యూరీని ఏర్పాటు చేయాలి. త్వ‌ర‌లోనే క‌మిటీ గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఏపీ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్‌ ధరలు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ రేట్లపై చర్చించ‌నున్నార‌ట‌.

ముందుగా ప్ర‌భుత్వ అధికారుల సమావేశం జ‌రుగుతుంది. త‌ర్వాత సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కందుల దుర్గేష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

This post was last modified on December 22, 2025 9:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nandi Awards

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

2 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

4 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

5 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

7 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

7 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

8 hours ago