Movie News

ఏపీలో నంది అవార్డులు అప్పుడే

ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో నంది అవార్డుల‌కు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జ‌నాలు ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. ఆ అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు. కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాక‌ క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా ఈ అవార్డుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది. ఐతే ఈ మ‌ధ్య తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చింది. పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించి వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా నంది అవార్డుల‌కు తిరిగి ప్రాణం పోయ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లున్నాయి. తాజాగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డుల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఉగాదికి నంది అవార్డుల వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. దీంతో పాటుగా నంది నాట‌కోత్స‌వాలు కూడా జ‌రుగుతాయ‌ని ఆయన చెప్పారు. ఉగాదికి నంది అవార్డులు ఇవ్వాలంటే.. ఇప్ప‌టి నుంచే అవార్డుల ఎంపిక కోసం ప‌ని మొద‌లుపెట్టాలి. ఇందుకోసం జ్యూరీని ఏర్పాటు చేయాలి. త్వ‌ర‌లోనే క‌మిటీ గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఏపీ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్‌ ధరలు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ రేట్లపై చర్చించ‌నున్నార‌ట‌.

ముందుగా ప్ర‌భుత్వ అధికారుల సమావేశం జ‌రుగుతుంది. త‌ర్వాత సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కందుల దుర్గేష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

This post was last modified on December 22, 2025 9:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nandi Awards

Recent Posts

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

1 hour ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

3 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

3 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

5 hours ago

పవన్ ప్రయాణం… సందేహాలు అనవసరం

ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…

6 hours ago

రాజశేఖర్ నిజాయితీకి అవకాశాలు రావాలి

ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…

13 hours ago