Movie News

ఏపీలో నంది అవార్డులు అప్పుడే

ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో నంది అవార్డుల‌కు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జ‌నాలు ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. ఆ అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు. కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాక‌ క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా ఈ అవార్డుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది. ఐతే ఈ మ‌ధ్య తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చింది. పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించి వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా నంది అవార్డుల‌కు తిరిగి ప్రాణం పోయ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లున్నాయి. తాజాగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డుల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఉగాదికి నంది అవార్డుల వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. దీంతో పాటుగా నంది నాట‌కోత్స‌వాలు కూడా జ‌రుగుతాయ‌ని ఆయన చెప్పారు. ఉగాదికి నంది అవార్డులు ఇవ్వాలంటే.. ఇప్ప‌టి నుంచే అవార్డుల ఎంపిక కోసం ప‌ని మొద‌లుపెట్టాలి. ఇందుకోసం జ్యూరీని ఏర్పాటు చేయాలి. త్వ‌ర‌లోనే క‌మిటీ గురించి ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఏపీ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్‌ ధరలు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ రేట్లపై చర్చించ‌నున్నార‌ట‌.

ముందుగా ప్ర‌భుత్వ అధికారుల సమావేశం జ‌రుగుతుంది. త‌ర్వాత సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కందుల దుర్గేష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

This post was last modified on December 22, 2025 9:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nandi Awards

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago