రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ వయొలెంట్ డ్రామాని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2026 డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ టీజర్ ఇవాళ అభిమానుల భారీ కోలాహలం మధ్య హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఏడాదికి ముందే ఇలా ప్లానింగ్ చేయడం చూస్తే ప్రమోషన్ పరంగా పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. రెండు నిమిషాల వీడియోలో క్యారెక్టర్ ని పరిచయం చేసిన దర్శకుడు ఎక్కువ విజువల్స్ రివీల్ చేయలేదు. షూటింగ్ ఇంకా కీలక దశకు చేరుకోవాల్సి ఉంది.
అనగనగా కళింగపట్నం అనే ఊరు. మొత్తం రౌడీలతో రాక్షస రాజ్యం ఏలుతూ ఉంటుంది. అయితే వీళ్ళెవరూ రౌడీలు కాదని ఇంటి పేరునే అలా మార్చుకున్న జనార్ధన (విజయ్ దేవరకొండ) అనే యువకుడు ఊచకోత అంటే ఏమిటో రక్తం సాక్షిగా అందరికీ పరిచయం చేస్తాడు. అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరికేందుకు వెనుకాడని అతని మనస్తత్వం వెనుక ఎవరికీ తెలియని ఒక చేదు బాల్యం ఉంటుంది. పసితనంలో తను చూసిన చీకటి నుంచి పుట్టిన ఉక్రోషమే రాక్షసుడిగా మారుస్తుంది. అసలు రౌడీ జనార్ధన అంటే ఎవరు, ఎందుకు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడనేది తెలియాలంటే ఇంకో సంవత్సరం దాకా ఎదురు చూడాలి.
విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. క్రిస్టో క్సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటెంట్ లో ఉన్న మూడ్ ని ప్రతిబింబించేలా ఉంది. హీరోయిన్ కీర్తి సురేష్ తో సహా ఎవరినీ రివీల్ చేయలేదు. కింగ్డమ్ తో విఫలమైనా మరోసారి అదే జానర్ తో తిరిగి హిట్టు కొట్టేందుకు విజయ్ దేవరకొండ బాగానే కష్టపడుతున్నాడు. దేహాన్ని మలుచుకున్న విధానం అదే సూచిస్తోంది. కొనతిరిగిన మీసకట్టు, విభిన్నంగా అనిపిస్తున్న స్లాంగ్ మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు. అయితే సభ్యతగా అనిపించని ల….కొడుకు అనే పదం ఇందులో కూడా వాడేశారు. దీనికి సోషల్ మీడియా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
This post was last modified on December 22, 2025 9:14 pm
ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది…
బిగ్ బాస్ షో ద్వారా.. ఆ తర్వాత కోర్టు మూవీలో విలన్ పాత్ర ద్వారా మళ్ళీ మంచి పాపులారిటీ సంపాదించి…
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,…
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.…
16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్కు,…